పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎంత టార్గెట్ చేసినా.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్షా సహా బీజేపీ కేంద్ర పెద్దలు ప్రత్యేకంగా దృష్టిసారించినా.. మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు మమతా బెనర్జీ.. అయితే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు… మమత బెనర్జీ ప్రణాళికలు రచిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖండ మెజార్టీ విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత కేంద్రంలో కీలక పాత్ర పోషించేందుకు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో…
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో పట్టు సాధించడానికి అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి.. ఓవైపు, మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పావులు కదుపుతుంటూ.. ఇంకా వైపు.. ప్రతీ అంశాన్ని క్యాచ్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.. ఎస్పీ, బీఎస్పీలు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.. ఇక, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఇతర రాష్ట్రాలకు విస్తరించడంపై ఫోకస్ పెట్టింది.. ఈ తరుణంలో.. కాంగ్రెస్ పార్టీకి గట్టి…
దేశంలో బీజేపీని ఓడించేందుకు కంకణం కట్టుకున్న దీదీ కాళ్లకు చక్రాలు కట్టుకొని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఆ పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నారు. బీజేపీ పాలన నుంచి దేశాన్ని కాపాడాలి అనే లక్ష్యంగానే దీదీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బెంగాల్లో ఇచ్చిన విజయాన్ని స్పూర్తిగా తీసుకొని గోవాలో పార్టీ పోటీ చేయడానికి సిద్ధమయింది. త్వరలోనే గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. 40 స్థానాలున్నా గోవా అసెంబ్లీలో ఎలాగైనా పాగా వేయాలని తృణమూల్ కాంగ్రెస్ చూస్తున్నది. ఈనెల…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గత కొంతకాలంగా కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు తగ్గట్టుగానే ఆయన కాంగ్రెస్ లో చురుకైన పాత్రను పోషిస్తూ వచ్చారు. అయితే, పంజాబ్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన తరువాత కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. బెంగాల్ ఎన్నికల తరువాత ఎన్నికల వ్యూహకర్తగా విధులు నిర్వహింబోనని చెప్పడంతో ఆయన కాంగ్రెస్ చేరుతారనే వార్తలు వినిపించాయి. అయితే, కాంగ్రెస్లో కొంతమంది పెద్దలు ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహాల వరకే…
ఈ రోజు పశ్చిమ బెంగాల్ లో భబానీపూర్ కు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో అందరూ ఊహించినట్లే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. అనంతరం ఈ ఫలితాల పైన ఆవిడ స్పందిస్తూ… భబానీపూర్ లో దాదాపు 46 శాతం మంది బెంగాలీయేతరులు ఉన్నారు. వారందరూ నాకు ఓటు వేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు భబానీపూర్ వైపు చూస్తున్నారు. ఇది నాకు స్ఫూర్తినిచ్చింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు…
సెప్టెంబర్ 30 వ తేదీన పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేశారు. బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటిగ్ జరుగుతున్నది. తాజా సమాచారం ప్రకారం తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 12 రౌండ్లు ముగిసే సరికి మమతా బెనర్జీ 35 వేల ఓట్ల మేజారిటీని…
భవానీపూర్ ఉప ఎన్నిక ముగిసింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ తరపున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ప్రియాంక బరిలో ఉన్నారు. అయితే, ఇది ముఖ్యమంత్రి సిట్టింగ్ స్థానం కావడంతో అమె విజయం నల్లేరుపై నడకే అయినప్పటికీ, బీజేపీ గట్టి పోటి ఇవ్వనుందని సర్వేలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక జరిగే సమయంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు మధ్య జరిగిన…
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టిసారించారు ఆ పార్టీ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆ బాధ్యతను తన మేనల్లుడికి అప్పగించారు.. ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తున్నారు. గోవాపై కూడా టీఎంసీ దృష్టిసారించింది.. ఇవాళ గోవా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత లూజినో ఫలీరో.. టీఎంసీ గూటికి చేరారు.. కోల్కతాలోని టీఎంసీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక…
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత కూడా పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కొందరు నేతలు.. టీఎంసీ విజయం సాధించి.. మరోసారి మమతా బెనర్జీ సీఎం అయిన తర్వాత తిరిగి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. అందులో ఒకరు ఎమ్మెల్యే ముఖుల్ రాయ్.. అయితే.. బీజేపీ టికెట్పై గెలిచి టీఎంసీలో చేరిన ఎమ్మెల్యే ముఖుల్ రాయ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత,…
వచ్చే ఏడాది దేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో గోవా కూడా ఒకటి. దేశంలో బీజేపీని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలన్ని కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నాయి. బెంగాల్ ఎన్నికల తరువాత దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు ఒక్కటిగా కలిసి పనిచేసుందుకు ముందుకు వస్తున్నాయి. కాగా గోవాలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండటంతో బీజేపీకి ఇప్పటి వరకు కలిసి వచ్చింది. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆప్ ఇప్పటికే రంగంలోకి…