శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోవ రోజు శ్రీవారు ఉదయం మోహిని అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు.. ఇక, బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ సేవ ఈ రోజే జరగనుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. ఇవాళ తిరుమలకు రానున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లలిత్.. శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొననున్నారు.. ఈ వాహన సేవకు వచ్చే భక్తులందరికి దర్శనభాగ్యం కల్పించేందుకు పటిష్టచర్యలు…
Tirumala: టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ సందర్భంగా సీఎం జగన్ తిరుమల టూర్పై రమణ దీక్షితులు అసహనం వ్యక్తం చేశారు. తిరుమల పర్యటనలో సీఎం జగన్ వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ అమలుపై ప్రకటన చేస్తారని భావించామని.. ఆయన ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అర్చకులంతా తీవ్ర నిరాశ చెందారని రమణదీక్షితులు ఆరోపించారు. టీటీడీలోని బ్రాహ్మణ వ్యతిరేకులు అర్చక వ్యవస్థను, ఆలయ విధానాలను నాశనం చేసే లోపే తగిన చర్యలు తీసుకోవాలని…
CM Jagan: ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి పట్టువస్త్రాలను ఆయన సమర్పించనున్నారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 3:35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి తిరుమలకు సీఎం జగన్ బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్ బస్సును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రాత్రి 8:20 గంటలకు తిరుమల శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. మంగళవారం రాత్రికి తిరుమలలోనే బసచేయనున్నారు. బుధవారం ఉదయం మరోసారి శ్రీవారిని…
Tirumala: ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుమల చేరుకునే భక్తులకు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి కీలక సూచనలు చేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 4వేల మంది సిబ్బందితో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2వేల మంది పోలీసులు అదనంగా గరుడ సేవ కోసం సేవలు అందిస్తారని.. మొత్తం 6వేల మంది పోలీసులు బ్రహ్మోత్సవాలలో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 27న…