Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ అందించింది. డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 11న ఆన్లైన్లో విడుదల చేస్తున్నామని టీటీడీ వెల్లడించింది. ఈనెల 11న ఉదయం 10 గంటలకు టికెట్లను విడుదల చేస్తున్నందున భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా దర్శనం టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ నెల మొత్తానికి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. భక్తులు ఈ…
తిరుమల శ్రీవారి ఆస్తులపై శనివారం నాడు టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది. అయితే దేశంలోని ప్రముఖ కంపెనీల ఆస్తుల కంటే తిరుమల శ్రీవారి ఆస్తులే ఎక్కువ అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలతో పోలిస్తే తిరుమలకు ఉండే ప్రత్యేకత వేరు. తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. భక్తులు ఎన్నో విలువైన…
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతూ వస్తోంది.. భక్తుల తాకిడితో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.. కరోనా సమయంలో పడిపోయిన హుండీ ఆదాయం ఆ తర్వాత ఏ నెల తీసుకున్నా రూ.100 కోట్ల మార్క్ కంటే తక్కువగా వచ్చిందే లేదు.. ఇవాళ శ్రీవారి హుండి ఆదాయం 4.18 కోట్లు రాగా… వరుసగా…
నవంబర్ 1వ తేదీ నుంచి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 1వ తేదీ నుంచి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని ప్రారంభిస్తాం.. తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లో టోకెన్లను జారీ చేస్తామని పేర్కొన్నారు.. ఏ రోజూ టోకెన్ల కోటాను ఆ రోజుకి మాత్రమే జారీ చేస్తాం.. సోమవారం, బుధవారం, శని, ఆదివారాల్లో 20 వేల నుంచి 25…
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం రూ. 54 లక్షలతో నిర్మించిన పార్కింగ్ షెడ్ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు ఎలక్ట్రికల్ బైక్లపై రాయితీ అందిస్తామని వెల్లడించారు.. ఇక, టీటీడీకి 100 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు దాతలు అందించారని తెలిపిన ఆయన.. నవంబర్ 1వ తేదీ నుంచి సర్వదర్శనం, ఎస్.ఎస్.డి టోకెన్…
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఒక్కసారైనా దర్శించుకోవడానికి భక్తులు తరలివెళ్తుంటారు.. ఒక్కసారి తిరుమలకు వచ్చారంటే.. ఇక, తిరుమలేషుడి దర్శనాకి ఎన్నిపర్యాయాలు అయినా వెళ్తూనే ఉంటారట భక్తులు.. ఓవైపు వీఐపీలు, మరోవైపు సాధారణ భక్తులు.. ఇలా తిరుమల గిరులు ఎప్పుడూ కిక్కిరిసే ఉంటాయి.. అయితే, శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీ).. నవంబర్ నెల కోటాకు చెందిన టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేయనుంది.. భక్తుల కోసం…