తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలికి అక్షింతలు వేసింది కన్స్యూమర్ కోర్టు… దర్శనం కేటాయింపు చేయనందుకు పరిహారంగా సంబంధిత భక్తుడికి రూ. 50 లక్షలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు… అయితే, తమిళనాడు రాష్టం సేలంకు చెందిన హరి భాస్కర్ అనే భక్తుడు… మేల్ చాట్ వస్త్రం సేవ కోసం 2006లో టీటీడీకి రూ.12,250 చెల్లించారు.. కానీ, ఇప్పటి వరకు దర్శనం కల్పించలేదు టీటీడీ.. 17 సంవత్సరాలుగా పలుమార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు హరి…
తిరుమలలో నేడు వరాహజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిచనున్నారు. నేడు వరాహ జయంతి సందర్భంగా.. ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని భూ వరాహస్వామివారి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేయనున్నారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం చేయనున్నారు.. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం వరాహస్వామి జయంతిని టీటీడీ ఘనంగా నిర్వహిస్తున్నది.…
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). అక్టోబరు నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు (ఈ నెల 18వ తేదీన) విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. రేపు ఉదయం 9 గంటల నుంచి టీటీడీ వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే, భక్తులకు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని టికెట్లు బుక్ చేసుకుంటే మంచిది.. ఎందుకంటే.. అక్టోబర్లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఆ ఉత్సవాల…
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆగస్టు 18వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే రోజులు మినహా మిగతా అన్ని రోజుల టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ నెలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. Read Also:…
తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. లాంగ్ వీకెండ్ రావడంతో అందరూ ఒక్కసారిగా తిరుమలకు చేరుకున్నారు. దీంతో సప్తగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి గోగర్భం డ్యామ్ వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈనెల 21 వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఛైర్మన్…
తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు.. వరుస సెలవులు రావడానికి తోడు.. పెళ్లిల సీజన్ కూడా కావడంతో.. తిరుమలకు తరలివస్తున్నారు భక్తజనం.. శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 20 గంటల సమయం పడుతుందంటే.. భక్తులు ఏ స్థాయిలో వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లని నిండిపోయి.. ఆస్థాన మండపం వరకు క్యూ లైనులో వేచివున్నారు భక్తులు.. ఇక, ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం…