Kala Venkatrao: వైసీపీ సర్కారు తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం నిర్మించిన వసతి గృహాల రేట్లను భారీగా పెంచి భక్తులపై మరింత అధిక భారం మోపడం దురుద్దేశపూరితమని మండిపడ్డారు. మొన్న లడ్డూ రేట్లు పెంచారని, నిన్న బస్ ఛార్జీలు పెంచారని.. నేడు వసతి గదుల రేట్లు పెంచి తిరుమల వెంకన్నను భక్తులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కళా…
TTD: భక్తులకు మరో షాక్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వసతి గదుల అద్దెను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. సామాన్య, మధ్యతరగతి భక్తులకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల అద్దెలను రూ. 500, రూ. 600 నుంచి ఏకంగా వెయ్యి రూపాయలకు పెంచింది.. ఇక, నారాయణగిరి రెస్ట్ హౌస్లోని 1, 2, 3 గదులను రూ. 150 నుంచి జీఎస్టీతో కలిపి రూ 1,700 పెంచారు. రెస్ట్హౌస్…
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాలని చూస్తున్న భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం.. ఎందుకంటే.. వరుసగా వివిధ దర్శనలు, సేవల టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇవాళ ఉదయం 9 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ.. జనవరి 12వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సంబంధించిన ఈ టికెట్లను ఆన్లైన్లో పెట్టనున్నారు అధికారులు.. ఇక, ఈ నెల 11వ తేదీ వరకు శ్రీవారి…
TTD Hundi New Record: కొలిచినవారి కొంగుబంగారం, కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వీవీఐపీలు, వీఐపీలు, ప్రముఖులు, భక్తులు పోటెత్తారు.. హుండీ ద్వారా శ్రీవారికి పెద్ద సంఖ్యలో కానుకలు సమర్పించుకున్నారు. దీంతో.. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనంత హుండీ ఆదాయం సమకూరింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించారు. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమలలో…
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఏకాదశి సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు.
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇవాళ 2022కి బైబై చెప్పేసి.. రాత్రి 12 గంటల తర్వాత 2023కి అడుగుపెట్టబోతున్నాం.. అంటే రేపటి నుంచే 2023 జనవరి నెల ప్రారంభం కాబోతోంది.. అయితే, జనవరి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఎక్కువగా ఉన్నాయి.. తిరుమలకు వెళ్లే భక్తులు.. అవి దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.. Read Also: Aadhaar: ఆధార్ను ఇలా చేస్తే అంతే సంగతులు.. కేంద్రం వార్నింగ్ ఇక, విశేష పర్వదినాల…
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది తిరుమలకు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమల కిక్కిరిసిపోనుంది.. అయితే, ఈ సమయంలో.. ఏపీఎస్ఆర్టీసీ, తిరుపతి విభాగం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైకుంఠ ద్వారం తెరిచి ఉంచే 10 రోజులపాటు దర్శన టికెట్లు కలిగి ఉన్న ప్రయాణికులను మాత్రమే కొండపైకి అనుమతించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం రచ్చగా మారుతోంది.. ఆర్టీసీ నిర్ణయంపై వెంకన్న భక్తులు మండిపడుతున్నారు..…
Tirumala: దేశవ్యాప్తంగా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నా కొన్ని ప్రదేశాలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించుకునే ఆలయాల జాబితాను ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు విడుదల చేసింది. ఈ జాబితాలో వారణాసి అగ్రస్థానంలో నిలిచింది. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల రెండో స్థానంలో ఉంది. కరోనా ఆంక్షల కారణంగా గతేడాది తిరుమల శ్రీవారిని తక్కువ సంఖ్యలో భక్తులు సందర్శించుకోగా, ఈ ఏడాది ఆంక్షల సడలింపుతో వారి సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని…