Magha Masam Temple Rush: తెలుగు రాష్ట్రాల్లో మాఘమాసం సందడి… ఆలయాల్లో రద్దీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళమాఘ పౌర్ణమి. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మాఘ పూర్ణిమకు భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పుణ్య నదులలో స్నానం చేయడం.. దానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ప్రతి నెలా వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువుకు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈసారి మాఘ పౌర్ణమి రోజున రవి పుష్యయోగంతో పాటు ఇంకా ఎన్నో శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగంలో రాముడు కూడా జన్మించాడని, అందుకే ఈ నక్షత్రానికి మతపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతారు. ఈ యోగంలో ఎలాంటి పని ప్రారంభించినా కచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు.
Read Also: Himanta Biswa Sarma: బాబర్ ఆక్రమణను తొలగించి రామమందిరాన్ని నిర్మించాం..
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
మాఘ పౌర్ణమి నాడు కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ పౌర్ణమి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. భద్రాద్రిలో నేడు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మాఘ పౌర్ణమి సందర్భంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. ఇటు కాకినాడలో మాఘ పౌర్ణమి ఆదివారం కావడంతో అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ లైన్ లలో దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్నారు భక్తులు. పెళ్లిళ్లు సీజన్ కావడంతో వసతి గదులు కొరత కనిపిస్తోంది. అనకాపల్లి జిల్లా పూడిమడక ,రాంబిల్లి,బంగారమ్మపాలెం సముద్ర తీరాలవద్ద మాఘపౌర్ణమి సందడి ఏర్పడింది.
మాఘపౌర్ణమి పుణ్యస్నానాలకై తెల్లవారు ఝామునుండే భారీగా తరలి వచ్చారు భక్తులు. భక్తుల సౌకర్యార్ధం మాఘపౌర్ణమి జాతర పేరుతో ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్నానాలాచరించే తీరాల వద్ద గజఈతగాళ్లను సిద్ధం చేశారు పోలీసులు. తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మాఘ పూర్ణిమ నాడు పూజను సాయంత్రం ప్రారంభించేందుకు ఉత్తమ సమయంగా పండితులు చెబుతున్నారు. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి. చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!