Magha Masam Temple Rush: తెలుగు రాష్ట్రాల్లో మాఘమాసం సందడి… ఆలయాల్లో రద్దీ
ఇవాళమాఘ పౌర్ణమి. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మాఘ పూర్ణిమకు భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పుణ్య నదులలో స్నానం చేయడం.. దానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ప్రతి నెలా వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువుకు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈసారి మాఘ పౌర్ణమి రోజున రవి పుష్యయోగంతో పాటు ఇంకా ఎన్నో శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగంలో రాముడు కూడా జన్మించాడని, అందుకే ఈ నక్షత్రానికి మతపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతారు. ఈ యోగంలో ఎలాంటి పని ప్రారంభించినా కచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు.
Read Also: Himanta Biswa Sarma: బాబర్ ఆక్రమణను తొలగించి రామమందిరాన్ని నిర్మించాం..
Also Read
- Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
- Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్గా..!
- Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. 'హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
- Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
మాఘ పౌర్ణమి నాడు కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ పౌర్ణమి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. భద్రాద్రిలో నేడు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మాఘ పౌర్ణమి సందర్భంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. ఇటు కాకినాడలో మాఘ పౌర్ణమి ఆదివారం కావడంతో అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ లైన్ లలో దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్నారు భక్తులు. పెళ్లిళ్లు సీజన్ కావడంతో వసతి గదులు కొరత కనిపిస్తోంది. అనకాపల్లి జిల్లా పూడిమడక ,రాంబిల్లి,బంగారమ్మపాలెం సముద్ర తీరాలవద్ద మాఘపౌర్ణమి సందడి ఏర్పడింది.
మాఘపౌర్ణమి పుణ్యస్నానాలకై తెల్లవారు ఝామునుండే భారీగా తరలి వచ్చారు భక్తులు. భక్తుల సౌకర్యార్ధం మాఘపౌర్ణమి జాతర పేరుతో ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్నానాలాచరించే తీరాల వద్ద గజఈతగాళ్లను సిద్ధం చేశారు పోలీసులు. తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మాఘ పూర్ణిమ నాడు పూజను సాయంత్రం ప్రారంభించేందుకు ఉత్తమ సమయంగా పండితులు చెబుతున్నారు. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి. చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
-
Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
-
Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
-
Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్గా..!
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!