Magha Masam Temple Rush: తెలుగు రాష్ట్రాల్లో మాఘమాసం సందడి… ఆలయాల్లో రద్దీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళమాఘ పౌర్ణమి. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మాఘ పూర్ణిమకు భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పుణ్య నదులలో స్నానం చేయడం.. దానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ప్రతి నెలా వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువుకు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈసారి మాఘ పౌర్ణమి రోజున రవి పుష్యయోగంతో పాటు ఇంకా ఎన్నో శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగంలో రాముడు కూడా జన్మించాడని, అందుకే ఈ నక్షత్రానికి మతపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతారు. ఈ యోగంలో ఎలాంటి పని ప్రారంభించినా కచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు.
Read Also: Himanta Biswa Sarma: బాబర్ ఆక్రమణను తొలగించి రామమందిరాన్ని నిర్మించాం..
Also Read
- IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
మాఘ పౌర్ణమి నాడు కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ పౌర్ణమి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. భద్రాద్రిలో నేడు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మాఘ పౌర్ణమి సందర్భంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. ఇటు కాకినాడలో మాఘ పౌర్ణమి ఆదివారం కావడంతో అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ లైన్ లలో దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్నారు భక్తులు. పెళ్లిళ్లు సీజన్ కావడంతో వసతి గదులు కొరత కనిపిస్తోంది. అనకాపల్లి జిల్లా పూడిమడక ,రాంబిల్లి,బంగారమ్మపాలెం సముద్ర తీరాలవద్ద మాఘపౌర్ణమి సందడి ఏర్పడింది.
మాఘపౌర్ణమి పుణ్యస్నానాలకై తెల్లవారు ఝామునుండే భారీగా తరలి వచ్చారు భక్తులు. భక్తుల సౌకర్యార్ధం మాఘపౌర్ణమి జాతర పేరుతో ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్నానాలాచరించే తీరాల వద్ద గజఈతగాళ్లను సిద్ధం చేశారు పోలీసులు. తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మాఘ పూర్ణిమ నాడు పూజను సాయంత్రం ప్రారంభించేందుకు ఉత్తమ సమయంగా పండితులు చెబుతున్నారు. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి. చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!