Kerala: కేరళ రాజధాని తిరువనంతపురం తూర్పు కోటలో ఉన్న శ్రీ పద్మనాథ స్వామి ఆలయానికి సంబంధించి కీలక సమాచారం వెలువడింది. ఆలయంలో ఇటీవల బంగారం మాయమైన విషయం తెలిసిందే. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే బంగారం దొరికింది. గోల్డ్ దొరికినప్పటికీ ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంగారు పూత కోసం గోల్డ్ నాణేలను తీశారు. ఆ సమయంలో స్ట్రాంగ్ రూమ్లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని దర్యాప్తులో తేలింది.
KC Venugopal post about India Flight Emergency Landing: మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (AI2455)లో టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి. గుర్తించిన పైలట్ చెన్నైలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వివరాల ప్రకారం.. విమానం రెండు గంటలకు పైగా గాలిలో ఉండి.. చివరకు చెన్నై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం రాత్రి 8 గంటలకు తిరువనంతపురం నుంచి…
Empuraan Row: ఎంపురాన్ మూవీపై వివాదం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ అంశంపై నటుడు మోహన్ లాల్ సైతం క్షమాపణలు చెప్పారు. తాజాగా, ఈ వివాదంపై డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక రియాక్ట్ అయ్యారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వ్యక్తిపై ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో కేరళలోని తిరువనంతపురం జిల్లాకు చెందిన 47 ఏళ్ల థామస్ గాబ్రియేల్ మరణించాడు. గాబ్రియేల్.. కేరళలో రిక్షా డ్రైవర్గా పని చేస్తున్నాడు
మలయాళీ దినపత్రిక మాతృభూమి కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాజ్యాంగం ప్రసాదించిన గ్యారంటీలను, మన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
Kerala Court: కేరళలో సంచలనం సృష్టించిన బాయ్ఫ్రెండ్ను హత్య చేసిన కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో గత వారం యువతి గ్రీష్మని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం ఆ మేరకు ఉరి శిక్షను ఖరారు చేసింది.
Sharon Raj murder case: 2022లో కేరళలో సంచలనం సృష్టించిన 23 ఏళ్ల రేడియాలజీ విద్యార్థి షారన్ రాజ్ హత్య కేసులో కేరళ కోర్టు గ్రీష్మా, ఆమె మామ నిర్మల కుమారన్ నాయర్లను దోషులుగా నిర్ధారించింది. నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు జనవరి 17న శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో గ్రీష్మ తల్లి సింధుపై తగిన ఆధారాలు లేకపోవడంతో నిర్దోషిగా విడుదల చేసింది. న్యాయమూర్తి ఎ.ఎం బషీర్ ఈ కేసులో జనవరి 19న శిక్షల పరిమాణాన్ని…
కేరళ తిరువనంతపురంలోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓ ట్యూషన్ టీచర్కు 111 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఓ కేసులో టీచర్ దోషిగా తేలాడు. మైనర్ బాలికను ప్రలోభపెట్టి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణపై అరెస్ట్ అయ్యాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. టీచర్ను దోషిగా తేల్చింది. జైలు శిక్షతో పాటు రూ.1.05 లక్షల జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 44 ఏళ్ల ఉపాధ్యాయుడు నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించకుంటే…
కేరళలో విషాదం చోటుచేసుకుంది. షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని నలుగురు మృతిచెందారు. శనివారం తిరువనంతపురం వెళ్తున్న కేరళ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు సహా నలుగురు పారిశుధ్య కార్మికులు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.