Empuraan Row: నా కొడుకును బలిపశువు చేయొద్దు.. ఎంపురాన్ వివాదంపై పృథ్వీరాజ్ తల్లి రియాక్షన్
- ఎంపురాన్ మూవీపై కొనసాగుతున్న వివాదం..
- ఎంపురాన్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక రియాక్ట్..
- తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Empuraan Row: ఎంపురాన్ మూవీపై వివాదం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ అంశంపై నటుడు మోహన్ లాల్ సైతం క్షమాపణలు చెప్పారు. తాజాగా, ఈ వివాదంపై డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక రియాక్ట్ అయ్యారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, ఈ ఇష్యూపై మొదట స్పందించొద్దు అనుకున్నాను.. కానీ, తన కుమారుడిని కించపర్చేలా తప్పుడు వార్తలు చూసి బాధతో ఈ పోస్టును సోషల్ మీడియా వేదికగా పెడుతున్నాను అని చెప్పుకొచ్చింది.
Read Also: Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కోసం హైదరాబాద్కు నెల్లూరు పోలీసులు..
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
అయితే, ఎంపురాన్ మూవీ తెర వెనక ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలుసు.. పృథ్వీరాజ్ సుకుమారన్ను అన్యాయంగా కొందరు నిందిస్తున్నారు అని మల్లిక తెలిపింది. మోహన్ లాల్, చిత్ర నిర్మాతలు ఎవరూ తమను పృథ్వీరాజ్ మోసం చేశాడని ఎక్కడ కూడా చెప్పలేదు. మోహన్ లాల్ నాకు ఎన్నో రోజులుగా తెలుసు.. నా తమ్ముడితో సమానం అని పేర్కొనింది. నా కుమారుడిని ఎన్నో సందర్భాల్లో ఆయన ప్రశంసించాడు. ఇప్పుడు ఆయనకు, నిర్మాతలకు తెలియకుండా కొందరు నా కొడుకుని బలిపశువుని చేయడానికి ట్రై చేస్తున్నారని మండిపడింది. అతడు ఎవరినీ మోసం చేయలేదు.. ఎప్పుడు చేయడు అని పృథ్వీరాజ్ తల్లి మల్లిక చెప్పింది.
Read Also: Triangle Love: ప్రాణం తీసిన ట్రయాంగిల్ లవ్.. ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య
కాగా, ఈ సినిమాలో సమస్యలు ఉన్నాయంటే అది ఇందులో భాగమైన అందరికీ బాధ్యత ఉంటుందని డైరెక్టర్ పృథ్వీరాజ్ తల్లి మల్లిక అన్నారు. వారందరూ తొలుత స్క్రిప్ట్ చదివారు.. చిత్రీకరణ సమయంలో కూడా అందరూ ఉన్నారు.. వారందరీ ఆమోదంతోనే ఈ చిత్రం తెరకెక్కింది కదా అని ప్రశ్నించింది. రచయిత కూడా ఎప్పుడూ పక్కనే ఉన్నారు.. అవసరమైతే డైలాగుల్లో మార్పులు కూడా చేసే వారని తెలిపింది. కానీ, సినిమా రిలీజ్ అయ్యాక పృథ్వీరాజ్ మాత్రమే ఎందుకు జవాబుదారీ అవుతాడు? అని అడిగింది. మోహన్ లాల్కు తెలియకుండా ఇందులో కొన్ని సన్నివేశాలు జత చేశారంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆయన కూడా సినిమాను చూశారు. నా కుమారుడు ఎప్పుడూ ఎవరి వ్యక్తిగత నమ్మకాలను వ్యతిరేకించలేదని మల్లిక సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. ఇక, ఎల్2:ఎంపురాన్’ సినిమా మార్చి 27న విడుదల అయింది. ఇప్పటి వరకూ రూ.100 కోట్లకు పైగా రాబట్టింది. అయితే, కొన్ని సన్నివేశాల కారణంగా వివాదాలు నెలకున్నాయి. దీంతో మూవీ యూనిట్ సినిమాలో మొత్తం 17 సన్నివేశాల్లో మార్పులు చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
-
Pawan Kalyan : ఓవర్ స్పీడ్లో దూసుకెళ్తున్న OG 2
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!