Israel: ఇజ్రాయెల్-జోర్డాన్ బోర్డర్లో కాల్పులు.. కేరళ వ్యక్తి మృతి
- ఇజ్రాయెల్-జోర్డాన్ బోర్డర్లో కాల్పులు
- కేరళకు చెందిన థామస్ గాబ్రియేల్ మృతి
- టూరిస్ట్ వీసాపై జోర్డాన్ వెళ్లిన గాబ్రియేల్
- ఫిబ్రవరి 10న ఇజ్రాయెల్ బోర్డర్ దాటుతుండగా ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వ్యక్తిపై ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కేరళలోని తిరువనంతపురం జిల్లాకు చెందిన 47 ఏళ్ల థామస్ గాబ్రియేల్ మరణించాడు. గాబ్రియేల్.. కేరళలో రిక్షా డ్రైవర్గా పని చేస్తున్నాడు. టూరిస్ట్ వీసా మీద జోర్డాన్కు వెళ్లాడు. అక్కడ నుంచి ఇజ్రాయెల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిపై కాల్పులు జరపగా.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని స్వస్థలం తీసుకొచ్చేలా సాయం చేయాలని కేంద్రాన్ని గాబ్రియేల్ కుటుంబ సభ్యులు కోరారు.
ఇది కూడా చదవండి: Congress Vs BJP: కుంభమేళాకు హాజరుకాకపోవడంపై నేతల మధ్య మాటల యుద్ధం
Also Read
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Crude Oil Prices: ఇరాన్కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
- Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
- Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
గాబ్రియేల్… ఇజ్రాయెల్కు అక్రమంగా సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తుండగా భద్రతా దళాలు కాల్పులు జరిపి చంపారని అతని కుటుంబానికి అమ్మన్లోని భారత రాయబార కార్యాలయం ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో గాబ్రియేల్.. టూరిస్ట్ వీసా మీద జోర్డాన్ వెళ్లాడు. అయితే అక్కడ నుంచి ఇజ్రాయెల్ వెళ్లేందుకు ప్రయత్నించిన విషయం తమకు తెలియదు అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
భద్రతా దళాలు.. ఫిబ్రవరి 10న గాబ్రియేల్ను ఆపేందుకు ప్రయత్నించినా అతడు మాట వినలేదని.. దీంతో అతడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని ఈ-మెయిల్లో పేర్కొంది. బుల్లెట్ తలలో తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడని తెలిపింది. అతని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఏ ఆస్పత్రిలో ఉంచారో అధికారులు ఆస్పత్రిని సందర్శించనున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఇది కూడా చదవండి: Rebal Star : ప్రభాస్ – ప్రశాంత్ వర్మ.. అనౌన్స్మెంట్ వీడియో రెడీ.?
గాబ్రియేల్ చివరి సారిగా ఫిబ్రవరి 9న తమతో మాట్లాడాడని.. అప్పటి నుంచి తమకు ఫోన్ కాల్స్ లేవని బంధువు తెలిపారు. బస చేసిన ప్రాంతంలో సురక్షితంగా ఉన్నాడని అనుకుంటున్నట్లు తెలిపారు. అకస్మాత్తుగా కాల్ చేసి కట్ చేశాడు.. అప్పటి నుంచి తిరిగి ఫోన్ కాల్ రాలేదన్నారు.
‘‘దురదృష్టవశాత్తు ఒక భారతీయ పౌరుడు మరణించాడని రాయబార కార్యాలయం తెలిపింది. మృతుడి కుటుంబంతో రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. మృతుడి మృతదేహాన్ని తరలించడానికి జోర్డాన్ అధికారులతో కలిసి పనిచేస్తోంది.’’ అని జోర్డాన్లోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్లో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Sleeping : అతిగా నిద్రపోతున్నారా..?
తాజావార్తలు
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
-
King 100: నాగ్100పై సస్పెన్స్కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
-
Crude Oil Prices: ఇరాన్కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!