Kerala: సైకోగా మారిన యువకుడు.. ప్రియురాలి సహా కుటుంబాన్ని చంపిన దుర్మార్గుడు
- కేరళలోని తిరువనంతపురంలో దారుణం
- సైకోగా మారిన యువకుడు
- ప్రియురాలి సహా కుటుంబాన్ని చంపిన దుర్మార్గుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని తిరువనంతపురంలో దారుణం జరిగింది. ఓ యువకుడు సైకోగా మారి మారణహోమం సృష్టించాడు. ప్రియురాలి సహా ఆమె కుటుంబ సభ్యులను దారుణాతీదారుణంగా హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అనంతరం వెంజరమూడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆరుగురిని చంపేసినట్టుగా పోలీసులకు చెప్పి నిందితుడు అఫాన్ (23) విషం తాగి లొంగిపోయాడు. దీంతో అఫాన్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: NBK : బాలయ్య – గోపిచంద్ మలినేని ఊహించిన దానికి మించి
Also Read
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
అఫాన్ అనే యువకుడు.. ఒక అమ్మాయిను ప్రేమించాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. అఫాన్.. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న ప్రియురాలి కుటుంబ సభ్యులను సుత్తి, కత్తితో దాడి చేసి చంపేశాడు. అయితే నిందితుడు.. తన తల్లిపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆమె కేన్సర్ పేషెంట్. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో కోలుకుంటోంది. ప్రియురాలి ఫర్షానా, ఆమె సోదరుడు అహ్సాన్, అమ్మమ్మ సల్మా బివి, మామ లతీఫ్, అత్త షాహిదా మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక నిందితుడిపై రెండు పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: Spirit : సందీప్ రెడ్డి స్పెషల్ కండిషన్స్.. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్!?
అయితే నిందితుడు అఫాన్ పోలీసులకు సమాచారం ఇస్తూ.. అప్పుల్లో ఉన్న తనకు ప్రియురాలి కుటుంబం సాయం చేయలేదని.. ఆ కారణం చేతనే చంపినట్లు అఫాన్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక పరమైన కారణాల చేతనే ఈ సామూహిక హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు గల్ఫ్లో వ్యాపారం చేస్తుండగా భారీ నష్టాలు వచ్చాయని.. దీంతో అప్పులు ఎక్కువైపోవడం.. ప్రియురాలి కుటుంబం సాయం చేయకపోవడం వల్లే ఈ హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Roja: చాలా రోజుల తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రోజా..
తాజావార్తలు
-
India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!