Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకొట వద్ద కారు బ్లాస్ట్ దేశాన్ని భయాందోళనకు గురి చేసింది. సోమవారం సాయంత్రం, కారులో అమోనియం నైట్రేట్ నింపుకుని దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ మొహమ్మద్గా గుర్తించారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 12 మంది మరణించారు.
Bangladesh: బంగ్లాదేశ్లో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని యూకే హెచ్చరించింది. తమ పౌరులు ఆ దేశానికి ప్రయాణించకుండా హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం యూకే ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ‘‘రద్దీగా ఉండే ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలు వంటి వాటిలో పాటు విదేశీ పౌరులు సందర్శించే ప్రదేశాలతో సహా తీవ్రవాద దాడులు విచక్షణారహితంగా జరగవచ్చు’’ అని యూకే తెలిపింది.
జమ్మూకశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులు దురదృష్టకరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భద్రతలో ఎలాంటి లోపం లేదని చెప్పారు. ఉగ్రవాదులకు భద్రతా బలగాలు ధీటుగా సమాధానమిస్తున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే లోయలో దాడులు తగ్గాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు.
Pakistan: పాకిస్తాన్ పరిపాలన సైన్యం చేతుల్లో ఉందో, లేక ఎన్నికైన ప్రభుత్వం చేతుల్లో ఉందా? అనేది ఎవరికి తెలియదు. నిజానికి బయటకు ప్రజాప్రభుత్వం కనిపిస్తున్నా, అంతా వెనకనుంచి నడిపించేది ఆ దేశ సైన్యమే. ఆ దేశ సైన్యాన్ని కాదని ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి ఉండదు. ఇదిలా ఉంటే, పాక్ ఆర్మీ అంతర్గత భద్రతను పర్యవేక్షించే పోలీసులు విధుల్లో్ కూడా జోక్యం చేసుకుంటోంది. ఆ దేశంలో సైన్యం వర్సెస్ పోలీసులుగా వ్యవహారం మారింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో జరుగుతున్న ఉగ్రదాడుల వెనక లష్కరే తోయిబా, ది రిసిస్టెన్స్ ఫ్రంట్కి చెందిన ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లుగా భద్రతా వర్గాలు తెల్చాయి.
Terrorist Attacks: జమ్మూ కాశ్మీర్లో వరసగా జరుగుతున్న ఉగ్రవాద ఘటనలు ఆ రాష్ట్రంలో మరోసారి భయాందోళనల్ని పెంచాయి. గత ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజునే, ఉగ్రవాదులు రియాసి జిల్లాలో శివ్ ఖోరీ నుంచి కత్రాకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి చేశారు.
Reasi Terror Attack: జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలో ఆదివారం బస్సుపై ఉగ్రవాద దాడి ఘటనలో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ వరసగా తీవ్రవాద దాడులతో అట్టుడుకుతోంది. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో మిలిటెంట్లు విరుచుకుపడుతున్నారు. ఈ రెండు ప్రావిన్సుల్లో గత రెండు రోజులుగా జరిగిన దాడుల్లో మొత్తం 18 మంది మరణించారు.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ భయంతో వణికిపోతోంది. ఇటీవల ఇరాన్ పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్పై దాడులు చేసింది, దీనికి ప్రతిగా పాకిస్తాన్ కూడా ఇరాన్పై వైమానిక దాడులు చేసింది. దీని తర్వాత ఇరాన్ పెద్ద ఎత్తున మిలిటరీ విన్యాసాలు చేయడంతో పాటు పాక్ సరిహద్దు వైపు కదులుతుందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్లో అంతర్గతంగా రాజకీయ, ఆర్థిక, భద్రతా సంక్షోభాలతో సతమతమవుతోంది.
ISIS: దేశవ్యాప్తంగా దాడులకు ప్లాన్ చేసిన ఏడుగురు అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులందరూ వారి హ్యాండర్ల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఐసిస్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు నిధులను సేకరించినట్లు దర్యాప్తులో తేలిందని చార్జిషీట్ పేర్కొంది.