ISIS: తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు కుట్ర.. ఎన్ఐఏ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISIS: దేశవ్యాప్తంగా దాడులకు ప్లాన్ చేసిన ఏడుగురు అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులందరూ వారి హ్యాండర్ల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఐసిస్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు నిధులను సేకరించినట్లు దర్యాప్తులో తేలిందని చార్జిషీట్ పేర్కొంది. దేశంలో ఉగ్రవాదాన్ని, హింసను పెంచాలని వారంతా భావించినట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. నిందితులంతా బాగా చదువుకున్నవారే అని.. వీరిలో సాంకేతికత గురించి తెలిసిన వారున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. పూణేలో అనేక సమావేశాలు నిర్వహించడంతో పాటు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఉగ్రవాదం కోసం సభ్యులను రిక్రూట్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు చార్జిషీట్ పేర్కొంది.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఐఈడీ కోసం రసాయనాలు కొనుగోలు చేయడానిక సల్ఫ్యూరిక్ ఆసిడ్, అసిటోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కోసం వెనిగర్, రోజ్ వాటర్, షెర్బాత్ వంటి కోడ్ పేర్లను ఉపయోగించారు. నిందితులు ఇండియాలో ఐఎస్ఐఎస్ భావజాలాన్ని పెంచాలని అనుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ‘‘రివేంజ్ ఆన్ కాఫిర్స్’’ అనే క్యాప్షన్తో ప్రచారాన్ని ప్రారంభించారు. వీటికి సంబంధించిన పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. కాఫీర్లు(ముస్లింయేతరులు) పగతీర్చుకోవాలని నిందితులు ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రయత్నించినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. నిందితులంతా విదేశాల్లో ఉన్న తమ హ్యాండ్లర్లకు దాడులకు సంబంధించిన ప్లాన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ టచ్ లో ఉన్నట్లు తేలింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!