Bangladesh: బంగ్లాదేశ్లో ఉగ్రదాడులకు అవకాశం.. తమ పౌరులకు యూకే జాగ్రత్త..
- బంగ్లాదేశ్ వెళ్లే వారు జాగ్రత్త..
- ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది..
- తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన యూకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని యూకే హెచ్చరించింది. తమ పౌరులు ఆ దేశానికి ప్రయాణించకుండా హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం యూకే ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ‘‘రద్దీగా ఉండే ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలు వంటి వాటిలో పాటు విదేశీ పౌరులు సందర్శించే ప్రదేశాలతో సహా తీవ్రవాద దాడులు విచక్షణారహితంగా జరగవచ్చు’’ అని యూకే తెలిపింది.
బంగ్లాదేశ్లో ఇటీవల కాలంలో మైనారిటీలపై , ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్పై ఆ దేశం దేశద్రోహ కేసు పెట్టి, అరెస్ట్ చేసింది. అతడికి బెయిల్ కూడా మంజూరు చేయలేదు. ఆయన తరపు వాదించే లాయర్లపై మతోన్మాదులు దాడికి తెగబడుతున్నారు. తాజాగా ఆయన తరుఫు వాదించే ఓ హిందూ లాయర్పై దాడి చేయడంతో ఆయన చావుబతుకుల మధ్య ఉన్నాడు. మరోవైపు చిట్టగాంగ్ బార్ అసోసియేషన్లో ముస్లిం న్యాయవాదులు, హిందూ న్యాయవాదుల్ని బెదిరిస్తున్నారు.
Also Read
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
Read Also: Dulkar Salman : మళ్లీ తెలుగోడి డైరెక్షన్లోనే.. దుల్కర్ సల్మాన్ తో రొమాన్స్ చేయనున్న బుట్టబొమ్మ
ఈ నేపథ్యంలోనే యూకే తన పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ‘‘కొన్ని సమూహాలు ఇస్లాంకు విరుద్ధమైన అభిప్రాయాలు, జీవనశైలి కలిగిన వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకున్నాయి. మైనారిటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో ఐఈడీ దాడులు ఉన్నాయి. బంగ్లాదేశ్ అధికారులు ప్లాన్డ్ అటాక్స్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’’అని యూకే అడ్వైజరీలో చెప్పింది.
బంగ్లాదేశ్ హిందూ వ్యతిరేక హింసపై యూకే ఆందోళన వ్యక్తం చేసింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఎంపీ మంగళవారం హౌజ్ ఆఫ్ కామన్స్లో చెప్పారు. ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే యూకే ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. “ప్రసిద్ధ హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణ దాస్ను దేశద్రోహ ఆరోపణలపై అరెస్టు చేసిన తర్వాత భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిన విషయం మాకు తెలుసు. UK ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ (FCDO) డెస్క్ ఆ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది” అని ఎంపీ కేథరీన్ వెస్ట్ చెప్పారు.
తాజావార్తలు
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?