Pakistan: పాకిస్తాన్లో మారణహోమం.. వేర్వేరు ఘటనల్లో 18 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ వరసగా తీవ్రవాద దాడులతో అట్టుడుకుతోంది. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో మిలిటెంట్లు విరుచుకుపడుతున్నారు. ఈ రెండు ప్రావిన్సుల్లో గత రెండు రోజులుగా జరిగిన దాడుల్లో మొత్తం 18 మంది మరణించారు. ఇందులో ఆరుగురు భద్రతా సిబ్బంది ఉండగా.. 12 మంది ఉగ్రవాదులు ఉన్నారు. సీనియర్ పోలీస్ అధికారితో సహా ఆరుగురు పోలీసులు మరణించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. బలూచిస్తాన్ ప్రావిన్సులో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పాకిస్తాన్ సాయుధ దళాల మీడియా విభాగం తెలిపింది.
ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని కులాచీ తహసిల్లోని కోట్ సుల్తాన్ ప్రాంతంలో భద్రతా దళాల కాల్పుల్లో 8 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని లక్కీ మార్వాత్లో శుక్రవారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఒక సాయుధ దుండగుడు, డీఎస్పీ, ఇద్దరు పోలీసులు మరణించగా ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు.
Also Read
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
- China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
Read Also: Akhilesh Yadav: గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్..
రంజాన్ పండగ సందర్భంగా పోలీస్ భద్రత తనిఖీల్లో భాగంగా రద్దీగా ఉండే పెషావర్-కరాచీ హైవేపై డీఎస్పీ గుల్ మహ్మద్, ఇతర పోలీసులతో కలిసి తాత్కాలిక తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారు చెక్ పాయింట్ నుంచి తిరిగి వస్తుండగా.. మంజివాల చౌక్ సమీపంలో పోలీస్ వ్యాన్పై సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో డీఎస్పీతో సహా పలువురు పోలసీులు మరణించారు.
లక్కీ మార్వాట్లో పోలీసులపై జరిగిన దాడిని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఇది ఉగ్రవాదుల పిరికి చర్యగా అభివర్ణించారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎం అలీ అమీన్ గుండాపూర్ కూడా తీవ్రవాద దాడిని ఖండించారు. ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని తాలిబాన్లు చేజిక్కించుకున్న తర్వాత రెండు దేశాల సరిహద్దులో ఉండే ఈ ప్రావిన్సు తీవ్రవాద దాడుల్ని ఎదుర్కొంటోంది. పాక్ తాలిబాన్లు ఆర్మీ, పాక్ పోలీసులు టార్గెట్గా దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇదే విధంగా దాడులు జరుపుతోంది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!