Jammu Kashmir: ఉగ్రదాడుల వెనక లష్కర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. తలపై రూ. 10 లక్షల నజరానా..
- జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో వరసగా ఉగ్ర ఘటనలు..
- వీటి వెనక లష్కర్ తోయిబా ఉగ్రవాది..
- సైఫుల్లా సాజిద్ జట్ ప్రేమయం ఉందన్న నిఘా వర్గాలు..
- పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో జరుగుతున్న ఉగ్రదాడుల వెనక లష్కరే తోయిబా, ది రిసిస్టెన్స్ ఫ్రంట్కి చెందిన ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లుగా భద్రతా వర్గాలు తెల్చాయి. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని కసూర్ జిల్లాలోని శంగమంగ గ్రామానికి చెందని సైఫుల్లా సాజిద్ జట్ ఈ దాడుల వెనక ఉన్న మాస్టర్ మైండ్గా ఎన్ఐఏ తెలిపింది. ఈ ‘హర్డ్ కోర్ టెర్రరిస్ట్’ తలపై రూ.10 లక్షల బహుమతి ఉంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని బేస్ క్యాంప్లో జాట్ పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అతని భార్య భారతీయ మూలాలకు చెందిన వ్యక్తి అని, అతనితోనే ఉంటుందని వారు తెలిపారు.
Read Also: J-K: జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్లు..ఆరుగురు ఉగ్రవాదుల హతం..
Also Read
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
ఇందకుముందు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) పనిచేసిన జట్, ప్రస్తుతం లష్కర్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నాడు. ఉగ్రవాదులు భారత్లోని ప్రవేశించడానికి సాయం చేస్తున్నాడని నిఘా వర్గాలు తెలిపాయి. సాజిద్ జట్ను లష్కర్కి ఆపరేషనల్ కమాండర్గా వ్యవహరిస్తూనే, దాని టెర్రర్ ఫండింగ్ను కూడా నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. అతనికి జమ్మూ కాశ్మీర్లో ఖాసిమ్ అనే వ్యక్తి ఉన్నాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతని కోసం భద్రతా సంస్థలు వేట సాగిస్తున్నాయి. గత కొన్ని ఏళ్లుగా కాశ్మీర్ లోయలో జరిగే అనేక ఉగ్రఘటనల వెనక జట్ హస్తం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
గత రెండు నెలలుగా జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. గత నెలలో రియాసిలో యాత్రికుల బస్సుపై అటాక్ జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఆ తర్వాత కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. కుల్గాం జిల్లాలో గత రెండు రోజులుగా జరిగి వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగులు ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజావార్తలు
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!