ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వమే ఈ దేశానికి శ్రీ రామ రక్షా అని అన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో డీకే అరుణ ఆధ్వర్యం లో వెయ్యి మంది కార్యకర్తలు పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఐదో సంపన్న దేశంగా భారత దేశాన్ని ఉంచిన ఘనత ప్రధాని మోడీ ది అని,…
శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి 10వ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఐదురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో ఉత్సవాల ఏర్పాట్లపై ఈవో పెద్దిరాజు దృష్టి సారించారు.
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వర్సెస్ కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉప్పు, నిప్పులా ఉండే ఆర్సీబీ క్రికెటర్ విరాట్ కోహ్లీ, కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ కలిసిపోయారు. బెంగళూరు, కోల్ కతా మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. టైమ్ ఔట్ సమయంలో గంభీర్ గ్రౌండ్ లోకి వచ్చి కోహ్లీని హత్తుకున్నారు. దీంతో స్టేడియంలోని అభిమానులంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో,…
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల కాలంలో కే.కేశవరావు, కడియం శ్రీహరిలు అనేక పదవులు అనుభవించి బీఆర్ఎస్ పార్టీని వీడడం సరైన పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ది అని ఆయన అన్నారు. కే.…
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ఆర్సీబీ, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కోల్ కతా ముందు ఓ ఫైటింగ్ స్కోరును నమోదు చేశారు. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా రాణించాడు. 59 బంతుల్లో 83 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 4…
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో నిర్వహించిన 'ప్రజాగళం' సభలో టీడీపీ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్కు అభివృద్ధి చేయడం చేతకాదని.. రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
అనంతపురం అర్బన్ టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. అనంతపురం అర్బన్ టీడీపీలో టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అనంతపురం అర్బన్ టిక్కెట్ను దగ్గుబాటి ప్రసాద్కు కేటాయించగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు టికెట్ కేటాయించలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభాకర్ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. డబ్బులకు టికెట్లు…
ఐపీఎల్ 2024 మెగా టోర్నీ ప్రారంభమై వారం రోజులు కావస్తుంది. మార్చి 21న మొదలైన ఐపీఎల్.. ఇప్పటికీ 9 మ్యాచ్ లు పూర్తి చేసుకోగా.. 10వ మ్యాచ్ జరుగుతుంది. ఇక.. ఈ ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ లోనూ ఆటగాళ్లు సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా.. ఇప్పటివరకు సన్ రైజర్స్ ప్లేయర్లు అత్యధిక సిక్సులు బాదారు. కేకేఆర్ తో ఆడిన మ్యాచ్ లో క్లాసెన్ సిక్స్ ల మీద సిక్స్ లు బాదాడు. అటు కేకేఆర్ బ్యాటర్…
పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొట్టింది..గతంలో తనను కేసీఆర్ కోడితే .. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కొట్టినట్లుగా పరిస్థితి మారిందని.. మరలా తన జోలికి వచ్చిన.. ఎగిరేగిరి పడిన వారిని అదే గతి తప్పదంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు.. మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు ఆశించి బంగపడ్డ మల్క కోంరయ్య కుటుంబన్ని ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.. ఇన్నాళ్లు గా పార్టీని బలోపేతం చేయడానికి వారు చేసిన వర్క్ ను అభినందించడంతో పాటు…