Kishan Reddy : మోడీ నాయకత్వమే ఈ దేశానికి శ్రీ రామ రక్షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వమే ఈ దేశానికి శ్రీ రామ రక్షా అని అన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో డీకే అరుణ ఆధ్వర్యం లో వెయ్యి మంది కార్యకర్తలు పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఐదో సంపన్న దేశంగా భారత దేశాన్ని ఉంచిన ఘనత ప్రధాని మోడీ ది అని, రాష్ట్రం లో రేవంత్ నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే కరెంట్ కోతలతో పాటు కరువు వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కర్ణాటకలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు, నాయకుల్లో నిరాశ నిస్పృహ మొదలైందన్నారు.
Also Read
బీఆరెస్ దొంగలు పోయి కాంగ్రెస్ గజదొంగలు వచ్చినట్లుందన్నారు. అసెంబ్లీలో బీఆరెస్ అవినీతి గురించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు విచారణ ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణను అప్పుడు కేసీఆర్ కుటుంబం దోచుకుంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ టీమ్ దోచుకుంటోందని ఆరోపించారు. దేశం లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కరువు కానీ కరెంట్ కోతలు గానీ లేవని అన్నారు కిషన్ రెడ్డి. అంతేకాకుండా.. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో దేశం లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణని భారీ మెజారిటీ తో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..