పల్నాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా క్రోసూరు, సత్తేనపల్లి బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు దాచేపల్లిలో పార్టీ నేతలతో సమావేశంకానున్నారు. పల్నాడు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులపై కసరత్తు చేయనున్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి అంశాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రలో భాగంగా…
నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. జనజాతర పేరుతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. హాజరుకానున్న ఖర్గే, రాహుల్గాంధీ, రేవంత్, నేతలు. జాతీయ మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్ గాంధీ. 10 లక్షల మంది జన సమీకరణకు కాంగ్రెస్ ప్రణాళిక. నేడు పల్నాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన. పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్న చంద్రబాబు. క్రోసూరు, సత్తేనపల్లి బహిరంగ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం…
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్-సీఎస్కే మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి హోంగ్రౌండ్ లో గెలిచి సత్తా చాటింది. 166 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో మార్క్రమ్ (50) హాఫ్ సెంచరీతో రాణించాడు. అలాగే ఓపెనర్లు.. ట్రేవిస్ హెడ్ 31, అభిషేక్ శర్మ 37 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లో 37 పరుగులతో మెరుపు…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కేసీఆర్ పూర్తి రాజకీయ దురద్దేశంతో ఆరోపణలు చేశారని.. కేసీఆర్ మాటల్లో అసత్యాలు, నిరాధారమైన ఆరోపణలు తప్పా ఒక్కటి నిజం లేదని మండిపడ్డారు. కేసీఆర్ కు అధికారం పోయిందనే బాధ ఆయన మాటల్లో, ఆయన ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. తాను బీఆర్ఎస్ తప్పులను ఎత్తిచూపితే.. కేసీఆర్ అధికారం పోయిన ఫ్ట్రస్టేషన్ లో తనపై తప్పుడు ఆరోపణలు…
ఏపీలో బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటన నాటి నుంచి కొనసాగుతున్న సస్పెన్స్ వీడిపోయింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. పాలకొల్లు ప్రజాగళ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిల్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై రెండు మూడు రోజుల్లో స్పందిస్తానని తెలిపారు. పదేళ్ళపాటు సీఎంగా ఉన్నాను... కచ్చితంగా క్లారిటీ ఇస్తానని కరీంనగర్ పర్యటనలో ఉన్న ఆయన సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో చిట్ చాట్ లో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజానిజాలు బయటపెడతానని కేసీఆర్ పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది పెన్షన్ దారులు చనిపోయారని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
ఐపీఎల్ 2024లో భాగంగా... సన్ రైజర్స్-సీఎస్కే మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నై బ్యాటర్ల దూకుడును ఆపారు. ముఖ్యంగా.. శివం దూబే క్రీజులో ఉన్నంతసేపు సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఒకానొక సమయంలో స్కోరు 200+ రన్స్ చేస్తుందని అనుకున్నారు. కానీ.. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలంబాట కార్యక్రమంపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ రైతుల సమస్యలను పట్టించుకోలేదని.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఆయన ఒక్క రైతును పరామర్శించలేదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి జైలుకి పంపించిన ఘనత కేసీఆర్ సర్కార్ కే దక్కిందని విమర్శించారు.
గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గుంటూరు లోక్సభ అభ్యర్థిగా ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ను బరిలోకి దిగిన విషయం విదితమే.. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన.. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ నుంచి కూడా అపూర్వ స్వాగతం లభిస్తోంది..