Komati Reddy Venkat Reddy: నా పేరు తీసే అర్హత కేసీఆర్కు లేదు.. తప్పుడు ఆరోపణలు చేస్తే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కేసీఆర్ పూర్తి రాజకీయ దురద్దేశంతో ఆరోపణలు చేశారని.. కేసీఆర్ మాటల్లో అసత్యాలు, నిరాధారమైన ఆరోపణలు తప్పా ఒక్కటి నిజం లేదని మండిపడ్డారు. కేసీఆర్ కు అధికారం పోయిందనే బాధ ఆయన మాటల్లో, ఆయన ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. తాను బీఆర్ఎస్ తప్పులను ఎత్తిచూపితే.. కేసీఆర్ అధికారం పోయిన ఫ్ట్రస్టేషన్ లో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. తాను వాళ్ల భూభాగోతాల్ని, లిక్కర్ మాఫీయాను ఎత్తిచూపితే.. వాళ్ల ఫోన్ ట్యాపింగ్ అరాచకాల్ని ప్రజల ముందు పెడితే.. వాళ్ల పాలనలో డ్రగ్స్ మాఫియా గురించి ప్రశ్నిస్తే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడని పేర్కొన్నారు.
Ukraine: రష్యా యుద్ధ విమానాల్ని ధ్వంసం చేసిన ఉక్రెయిన్
Also Read
ప్రజల్ని కష్టాల పాలు చేసిన కేసీఆరే.. ప్రజలు కష్టపడుతున్నారని మొసలి కన్నీరు కారుస్తుండటం విచిత్రమైన పరిస్థితి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు కేసీఆర్ రాజకీయ యాత్రలకన్నా.. తీహార్ జైలు యాత్ర చేస్తే బాగుంటుందన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ భయంతో ప్రజల్లో సానుభూతి కోసం రాజకీయ యాత్రలు చేయడం తప్ప కేసీఆర్ కు ఏనాడు ప్రజల గురించి చిత్తశుద్దితో పనిచేసింది లేదని పేర్కొన్నారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం నాన్ బెయిలెబుల్ గా మూడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది.. ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం వరుసగా రెండు సంవత్సరాలు జైళు శిక్షపడితే విడుదల అయిన తర్వాత ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని స్పష్టంగా ఉందన్నారు. ఇంకా కేసీఆర్ రాజకీయాల వదిలేస్తే మంచిదని పేర్కొన్నారు.
Heat Wave: రానున్న రెండు రోజులు జాగ్రత్త.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో వడగాలులు..
తాను ప్రజల ముందు ఉన్న నిజాల్ని ప్రశ్నిస్తే.. కేసీఆర్ తనపై బురదజల్లి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. తన జీవితం ప్రజా సేవకే అంకితం.. విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లోకి ఉన్నా.. ఇప్పటి దాకా అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజా సేవలోనే ఉన్నానని తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే.. కాంగ్రెస్ కార్యకర్తలు కర్రు కాల్చి వాతలు పెడతారని హెచ్చరించారు. తన పేరు తీసే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. తాను ఏ కాంట్రాక్టు కంపెనీలో డైరెక్టర్ ను, పార్ట్ నర్ గా లేనని తెలిపారు. తన జీవితం తెరిచిన పుస్తకం.. తనకు మీలా బుర్జ్ ఖలిఫాలో 69 ఫ్లోర్ లో ఇల్లు లేదు.. ఇప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉంటున్నాని తెలిపారు. నీకు దమ్ముంటే నాకు కంపెనీ ఉందని నిరూపించి మాట్లాడు అంతేకానీ.. ఈ గాలి మాటలు మాట్లాడి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటే నిప్పు లాంటి వ్యక్తి.. నీలా తప్పులు చేసే వ్యక్తి కాదన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద ఆరోపణలు చేసే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడితే మంచిదని తెలిపారు.
తాజావార్తలు
-
Yash Toxic: యష్కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?