ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠపోరులో రాజస్థాన్ విజయం సాధించింది. 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. ఒకానొక సమయంలో మ్యాచ్ పంజాబ్ వైపు ఉన్నప్పటికీ.. హెట్మేయర్ చెలరేగడంతో రాజస్థా్న్ కు విజయం వరించింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థా్న్.. 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.
దళితుల బంధువును సత్వరమే లబ్ధిదారులకు పంపిణీ చేయకుంటే తాను, గుర్తించిన లబ్ధిదారులందరితో కలిసి నెక్లెస్ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. ఏప్రిల్ 13, శనివారం లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది లబ్ధిదారులకు BRS ప్రభుత్వం దళిత బంధు మంజూరు చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు నిధులు…
రూ. 4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ను వదిలి బస్సును నడిపాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోహిత్ శర్మ ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. రోహిత్ శర్మ మైదానంలో బ్యాట్ తో బౌండరీలు బాదడమే కాదు.. బయట కూడా అప్పుడప్పుడు చలాకీతనం ప్రదర్శిస్తారు. తాజాగా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను తరలించే బస్సుకు రోహిత్ డ్రైవర్ గా మారారు.
హైదరాబాద్లోని బి.ఎన్ రెడ్డి నగర్లో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వలసవాసులు అపూర్వ స్వాగతం పలికారు. అశేష జనవాహిని మధ్య యువత, ఆడపడుచులు బి.ఎన్.రెడ్డి నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ఉదయగిరి నియోజకవర్గ సభ్యులు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. కాకర్ల సురేష్ కు మేమున్నాము మీకు అని ధైర్యాన్ని నింపి మా అందరి ఓటు సైకిల్ గుర్తు మీద మా పవిత్రమైన ఓటు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ స్వల్ప స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. పంజాబ్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ బౌలర్ల ముందు పంజాబ్ బ్యాటర్లు తడబడ్డారు. చివరలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అశుతోష్ శర్మ అత్యధిక స్కోరు చేశాడు. కేవలం 16 బంతుల్లో 31 పరుగులు చేసి.. స్కోరును పెంచాడు.
భారత క్రికెట్ జట్టులో అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎవరు అంటే.. మహేంద్ర సింగ్ ధోనీ అని చెప్పవచ్చు. అతని కెప్టెన్సీలో భారత్కు మూడు ఐసీసీ టైటిళ్లను సాధించిపెట్టాడు. ధోనీ సారథ్యంలో టీమిండియా.. మొదటగా టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది. టీమిండియా ఐసీసీ టైటిల్స్ ను గెలిచి 28 ఏళ్లు అవుతుంది. 2011 ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్ అందరి మదిలో గుర్తుండిపోతుంది. ఆ తర్వాత ఐసీసీ…
అమరావతి నిర్మించింది.. ఆంధ్రాకు సాప్ట్వేర్ను పరిచయం చేసింది.. అందుకోసమే..! ప్రజాగళం 32వ సభ గుంటూరు జిల్లాలోని తాడికొండలో జరుగుతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ ఇది తాడికొండ కాదు రాష్ట్ర రాజధాని అమరావతి.. అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను.. ఈ రాజధానిని ఈ అమరావతిని ఒక వెంట్రుక కూడా ఎవరు కదిలించలేరు.. ఈరోజు ఏప్రిల్ 13.. మే 13న చరిత్ర తిరగబడుతుంది.. ప్రజలు రాసిన చరిత్ర మిగులుతుంది.. తెలుగువాడు గర్వపడేలా రాజధాని ఉండాలని…
ఢిల్లీలో శనివారం వాతావరణం చల్లబడింది. ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో కనీసం 22 విమానాలను దారి మళ్లించారు. వాటిలో 9 విమానాలను జైపూర్కు, 8 లక్నోకు, 2 చండీగఢ్కు, వారణాసి, అమృత్సర్ మరియు అహ్మదాబాద్లకు ఒక్కో విమానాన్ని మళ్లించారు. ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రూట్లను మార్చిన విమానాలలో 9 ఇండిగో విమానాలు, 8 ఎయిర్ ఇండియా విమానాలు, 3 విస్తారా విమానాలు ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి…
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము మూడు జెండాలతో వచ్చినా.. మూడు పార్టీలతో వచ్చిన అజెండా ఒకటేనని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా పరిరక్షణ అలాంటి పాలన రావాలంటే సైకో పోవాలి.. కూటమి గెలవాలన్నారు. ప్రజలకు న్యాయం జరగాలి అని రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి సంఘీభావం తెలిపారని చెప్పారు. ఈ రాష్ట్రంలో…