Extra Peg Row: ‘ఎక్స్ట్రా పెగ్’ తీసుకోండి.. మహిళా మంత్రికి బీజేపీ నేత సూచన.. కాంగ్రెస్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extra Peg Row: కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ రాత్రి బాగా నిద్రపోవడానికి ‘ఒక పెగ్’ తీసుకోవాలని కర్ణాటక బీజేపీ నేత సంజయ్ పాటిల్ సూచించి వివాదం రేకెత్తించారు. హెబ్బాల్కర్ను హేళన చేస్తూ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీ పెరుగుదల హెబ్బాల్కర్ను చాలా ఆందోళనకు గురిచేస్తుందని, రాత్రి బాగా నిద్రపోవడానికి నిద్ర మాత్ర లేదా అదనపు పెగ్ తీసుకోవాలని సూచించారు.
Read Also: MLC Kavitha: నేటితో ముగిసిన కవిత సీబీఐ కస్టడీ.. నేడు ప్రత్యేక కోర్టు ముందుకు
Also Read
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
“నేను కర్ణాటకలోని ఎనిమిది ప్రాంతాలకు ఇన్చార్జిగా పనిచేశాను. బెలగావిలో పెద్ద సంఖ్యలో మహిళలు బీజేపీకి మద్దతుగా వస్తున్నారు. అందుకే మా అక్క (లక్ష్మీ హెబ్బాల్కర్) నిద్రపోయేందుకు నిద్రమాత్రలు వేసుకోవాలని కోరుకుంటున్నాను. లేదా మంచిగా నిద్రపోవడానికి అదనపు పెగ్ కూడా తీసుకుంటే రమేష్ జార్కిహోళి అక్కడ ప్రచారం చేయడం కూడా కష్టమవుతుంది” అని శనివారం బెలగావిలో జరిగిన సభలో పాటిల్ అన్నారు. లక్ష్మీ హెబ్బాల్కర్పై చేసిన వ్యాఖ్యల ద్వారా సంజయ్ పాటిల్ మొత్తం మహిళా సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని అవమానించారని కర్ణాటక కాంగ్రెస్ బీజేపీపై విరుచుకుపడింది. బీజేపీ మహిళా వ్యతిరేక వైఖరి పెరుగుతోందని కూడా ఆ పార్టీ పేర్కొంది.
Read Also: Sarabjit Singh: సరబ్జీత్ సింగ్ ఎవరు..? పాకిస్తాన్ చేతికి ఎలా చిక్కాడు..? ఈ విషాదగాథ వివరాలు..
“మహిళలను ఎవరు చిన్నచూపు చూస్తున్నారు అంటే వారి పతనం మొదలైందని.. బీజేపీ, జేడీఎస్ పార్టీల పతనం మొదలైందని.. అందుకే వారి మహిళా వ్యతిరేక ధోరణి పెరుగుతోందని.. కౌరవులు, రావణుడిలాగా బీజేపీ, జేడీఎస్లు సర్వనాశనం కావడం ఖాయమని కర్ణాటక కాంగ్రెస్ ఎక్స్(గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్లో తెలిపారు. ముఖ్యంగా, హెబ్బాల్కర్ కుమారుడు మృణాల్ రవీంద్ర హెబ్బాల్కర్ బీజేపీ అభ్యర్థి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్పై బెలగావి స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
-
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!