శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హెల్త్ టూరిజం హబ్ 500 నుంచి 1000 ఎకరాల్లో విస్తరించి దానికి అనుగుణంగా భూమిని సేకరించనున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటితో పోటీపడి ఈ హబ్లో అన్ని వ్యాధులకు నాణ్యమైన చికిత్స అందించాలనే ఆలోచన ఉంది. హబ్లో తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అన్ని అగ్రశ్రేణి సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి శనివారం ఇక్కడ తెలిపారు.…
కొలెస్ట్రాల్ పెరగడం తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. కొలెస్ట్రాల్ మీ రక్తంలో కనిపించే మైనపు పదార్థం. మీ కాలేయం కొలెస్ట్రాల్ను స్వయంగా తయారు చేస్తుంది లేదా మీరు తినే, తాగే వాటి నుంచి అది పేరుకుపోతుంది. శరీరానికి ఆరోగ్యంగా ఉండటానికి కొలెస్ట్రాల్ అవసరం, కానీ దాని స్థాయి పెరిగినప్పుడు, అది అనేక తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది
రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి చెందిన కాపు సామాజికవర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశకు గురిచేస్తోందని మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి , ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వానకాలం విడత వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకాన్ని ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదు. తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో నిరంజన్రెడ్డి మాట్లాడుతూ రుతుపవనాలకు ముందు వర్షాలు కురిసి ఖరీఫ్ పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ రైతు భరోసా అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయలేదన్నారు . యాసంగి పంటలకు ఎకరాకు…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు.
రేషన్ కార్డ్ ఏ కాదు ఏదైనా అనర్హులైన వారు వారి అంతట వారే తప్పుకుంటే మంచిదన్నారు రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ధనుకులకి కాదు బీదవారి ప్రభుత్వమని, ప్రజలకి అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఎవరైనా అధికారులు ఎక్కువ చేస్తే నా పాలనలో ట్రాన్స్ఫర్లు ఉండవు డైరెక్ట్గా రిమూవ్ చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు.…
నల్లగొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజర్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ గతంలో ఎవరు చేయలేదని, గత ప్రభుత్వాలు చేసిన రుణమాఫీ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. రెండు లక్షల రుణమాఫీ దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు…
ఏపీ విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 3వ బ్లాక్లో బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విద్యుత్ వ్యవస్థ మీద చాలా పట్టు ఉందని, ఆయన ఈ రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారన్నారు.
అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రజా దర్బార్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా చాలా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని మంత్రి వెల్లడించారు.
ఐటీఐఆర్ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసింది.. మోడీ సర్కారు రద్దు చేసిందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రద్దు చేసిన ఐటీఐఆర్ ని తెప్పించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి.. సంజయ్ లదే అని జగ్గారెడ్డి అన్నారు. రెచ్చగొట్టడం కాదు.. ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టండని, చేరికల అంశం సీఎం పరిధిలోనిదన్నారు. నా పరిధికి మించి స్పందించను..రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట తప్పన్నారు. ఐటీఐఆర్ upa ప్రభుత్వం మంజూరు చేసింది.. మోడీ సర్కారు రద్దు చేసిందని, తెలంగాణ…
రైస్ మిల్లింగ్ పరిశ్రమలో దేశంలోనే నంబర్ వన్ రైస్ మిల్లింగ్ పరిశ్రమగా ఎదగాలంటే అత్యాధునిక సాంకేతికత, యంత్రాలను అందిపుచ్చుకోవాలని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. శుక్రవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 16వ అంతర్జాతీయ రైస్ అండ్ గ్రెయిన్స్ టెక్ ఎక్స్పో 2024ను ప్రారంభించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రైస్ మిల్లింగ్ మరియు నాణ్యమైన బియ్యం ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా మార్చడానికి రైస్ మిల్లర్లకు…