వచ్చేవారంలో పిఠాపురంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు తర్వాత తొలిసారి నియోజకవర్గానికి రానున్నారు.
వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం కనీస మద్దతు ధర పెంచిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ లో పండించే వరి మద్దతు ధర కూడా పెరిగిందని, పత్తి పంట పై ఒకే సారి 500 పెంచిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల భర్తీ విషయం లో ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని ఆయన మండిపడ్డారు. జాబ్ కాలెండర్ ను అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు బహిరంగ సభల్లో…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ జరుగుతోంది. ఈ భేటీకి తెలుగుదేశం ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. తొలి పార్లమెంటరీ పార్టీ భేటీ కావటంతో సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
ఓ బాలిక మిస్సింగ్ కేసులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని... ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది.
నగరంలో జరుగుతున్న వివిధ రకాల దొంగతనాలను అరికట్టడానికి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.. ఇందులో భాగంగానే నిన్న అర్ధ రాత్రి సికింద్రబాద్ లోని మెట్టుగూడ లో డెకాయ్ ఆపరేషన్ చేసి రోడ్డు పక్కన నిద్రించే వారినే టార్గెట్ చేసి వారి సెల్ ఫోన్లు దొంగిలించే ముఠాను అరెస్ట్ చేశారు.. ఈ డెకాయ్ ఆపరేషన్ పై పూర్తి సమాచారం తెలియజేస్తున్న ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ మాట్లాడుతూ.. హైదరాబాదులో యాంటీ డెకొయిట్ టీమ్స్…
వర్షాకాలం జ్వరం, జలుబు సమస్యలను పెంచుతుంది. వర్షాకాలంలో హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతలు జ్వరం, జలుబు బారిన పడే అవకాశాలను పెంచుతాయి. దానితో పాటు ముక్కు కారటం, గొంతు నొప్పి, కళ్ళు నుండి నీరు కారడం, చలి వంటి లక్షణాలు ఉంటాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందువల్ల.. మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలనుకుంటే.. మీరు మీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవాలి.
మహారాష్ట్రలోని అమరావతిలో ఎయిర్ ఇండియా ఫ్లయింగ్ స్కూల్ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ ఫ్లయింగ్ స్కూల్లో ప్రతి సంవత్సరం 180 మంది పైలట్లకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. పైలట్ల కొరతను ముందే ఊహించి, ఎయిర్ ఇండియా మహారాష్ట్రలోని అమరావతిలో ఏడాదికి 180 మంది పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఒక ఫ్లయింగ్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జీ.. రూ.కోట్లు నీళ్ల పాలు.. వారంలో రెండో ఘటన బీహార్లో మరో వంతెన కూలింది. సివాన్ జిల్లాలోని గండక్ కెనాల్పై నిర్మించిన వంతెన శనివారం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. వంతెన కూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వంతెన పాతదని ఓ అధికారి తెలిపారు. వంతెన కూలిపోవడంతో సమీపంలోని డజన్ల కొద్దీ గ్రామాలతో కనెక్టివిటీ కోల్పోయింది.…
ఈ రోజుల్లో ఈ-కామర్స్ వెబ్సైట్లలో షాపింగ్ చేసే ట్రెండ్ బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి చెందిన ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ తన కస్టమర్లకు పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతోంది. చాలా మంది వినియోగదారులు ఆన్లైన్ ఆర్డర్లు త్వరగా లేదా ఇచ్చిన తేదీలో డెలివరీ చేయబడలేదనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫ్లిప్కార్ట్ వచ్చే నెలలో భారీ ప్రారంభానికి సిద్ధమవుతోంది. వాస్తవానికి ఫ్లిప్కార్ట్ తన కొత్త సర్వీస్ ‘ఫ్లిప్కార్ట్ మినిట్స్’ని జులై 15న ప్రారంభించవచ్చు.
మేడ్చల్లో జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును మేడ్చల్ పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితులను పట్టుకున్నారు. జగదాంబ జ్యువెలరీ షాప్లో మాస్క్, బుర్ఖా ధరించి యజమానిని కత్తితో పొడిచి డబ్బు ఎత్తుకెళ్లారు దుండగులు. సిసి కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు పోలీసులు. సైబరాబాద్ సీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహతి మీడియా మాట్లాడుతూ.. మేడ్చల్ లో జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును ఛేదించామని తెలిపారు. 24 గంటల్లో…