అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. పర్యటన సందర్భంగా బ్లింకెన్ ఈ రోజు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో కూడా సమావేశమయ్యారు.
నేపాల్లో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తోంది. నేపాల్ తూర్పు ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని కొనసాగిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా సంభవించిన విపత్తులో పలువురు మరణించగా, డజన్ల కొద్దీ తప్పిపోయినట్లు సమాచారం.
సికింద్రాబాద్ బన్సీలాల్పేటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో ఈ ఘటన జరిగింది. కుమారుడు, కూతురిని భవనం 8వ అంతస్తు నుంచి కిందపడేసిన అనంతరం.. తల్లి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు కవలలుగా గుర్తించారు.
తనను ప్రజా క్షేత్రంలో బాదనం చేయాలన్న దానిపై ప్రత్యర్థుల చేస్తున్న కుట్రగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు ఇంటి సమస్యను బయటికి తీస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఆస్తుల సమస్య ఉంటుంది. కానీ.. ఇంటి సమస్యను రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో నేను కబ్జా చేశానని ఓ జిల్లా కలెక్టర్ అన్నారు.
రాబోయే నెలల్లో సింగపూర్లో ఆర్థిక మందగమనం పెరగవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత వారం సింగపూర్లో బలహీనమైన ఆర్థిక నివేదిక మాంద్యం భయాలను పెంచింది.
ఎండల ప్రభావం ఆపరేషన్లు(సర్జరీ)పై పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యవసర సర్జరీలే చేస్తున్నారు వైద్యులు. మరోవైపు ఎలక్టీవ్ సర్జరీలు నిలిపివేయాలని సర్క్యూలర్ కూడా జారీ అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే.. బాడీ డీహైడ్రేషన్ గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. అందుకే అత్యవసరం అయితేనే సర్జరీలు చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అత్యవసరం కానివి వాయిదా వేయాల్సిన ఆపరేషన్లను ఆపి వేస్తున్నట్లు ఎన్టీవితో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ తెలిపారు.
సోమవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పాలకమండలి నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. ఒంటిమిట్టలో అన్నప్రసాద సముదాయ నిర్మాణం కోసం రూ.4 కోట్లు కేటాయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్. తిరిగి రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే పార్టీలో ఉన్నా క్రీయాశీలకంగా పనిచేయనివారితో వరుసగా భేటీ అవుతున్నారు. breaking news, latest news, telugu news, vishnu vardan reddy, pjr, manikrao thakre
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సోమవారం హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గ్రామానికి చేరుకున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా తుమ్మలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన పరిశీలించారు. అనంతరం తుమ్మలూరులో కార్యక్రమంలో భాగంగా మహా గని మొక్కను నాటారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గం తాటికల్ గ్రామంలో ప్రజలనుదేశించి ప్రసంగించారు. ప్రజల సంపదను దోపిడీ చేస్తున్నారు బీఆర్ఎస్ పాలకులని భట్టి విమర్శించారు. దొరల ప్రభుత్వం వద్దు ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందామని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, big news, bhatti vikramarka, congress, people march