Harish Rao : ఖైదీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట మండలం ఎన్సాన్ పల్లి శివారులో 78కోట్లతో జిల్లా జైలు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్ రావు, అడిషనల్ జైళ్ల శాఖ డీజీపీ జితేందర్. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జైళ్లలో ఉన్న ఖైదీలకు మానసిక పరివర్తన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఖైదీలలో మార్పు వచ్చి సత్ప్రవర్తన వచ్చి వారి కాళ్ళమీద వారు బ్రతికేలా దారి చూపెడుతోందని, ఖైదీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. 425మంది ఖైదీలు వుండే విధంగా 34ఎకరాల్లో ఇక్కడ ఆధునిక వసతులతో నిర్మాణం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Also Read : Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ఇదిలా ఉంటే.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ద్వారా వెనకబడిన తరగతుల కులవృత్తిదారులకు 66 మందికి 100 శాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థిక సాయం, 49 మంది దివ్యాంగులకు రూ.50వేల చొప్పున స్వయం ఉపాధి కొరకు లోన్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల పింఛన్ల విషయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యధిక పెన్షన్ ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు.
Also Read : Bihar: పెళ్లి కాసేపట్లో అనగా ప్రియుడితో సోదరి జంప్.. కోపంతో పిండం పెట్టిన సోదరుడు
మహారాష్ట్ర, కర్ణాటక రూ.900 నుంచి 1,200 ఉండగా, గుజరాత్ లో రూ.900 మాత్రమే దివ్యాంగులకు పింఛన్ ఇస్తున్నారని తెలిపారు. ఏ రాష్ట్రంలో రూ.12 వందలకు మించి ఫించన్ ఇవ్వడం లేదన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తల్లి మనస్సుతో అలోచించి ఇటీవల పెంచిన పింఛన్ తో కలుపుకొని రూ.4,016 అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మంది దివ్యాంగులకు ప్రతి నెలా రూ.4,016 పింఛన్ అందనుందన్నారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!