Home
Telugu News
Telugu News News
-
Delhi: ఢిల్లీలోని స్కూళ్లకు శీతాకాల సెలవులు..
ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి 6 వరకు శీతాకాల సెలవులు ఉంటాయని ఢిల్లీ ప్రభుత్వ విద్యా శాఖ బుధవారం తెలిపింది. సాధారణంగా, ప్రాథమిక పాఠశాల పిల్లలకు శీతాకాల సెలవులు డిసెంబర్ 25 నుండి జనవరి 15 వరకు, ప్రాథమిక తరగతులకు శీతాకాల సెలవులు జనవరి 1 నుండి 15 వరకు ఉంటాయి. ఈసారి శీతాకాల సెలవులను 10 నుంచి 15 రోజులు తగ్గించారు. -
Uttar Pradesh: యూపీలో దారుణం.. కూతురిపై తండ్రి అసభ్య ప్రవర్తన..!
తల్లి తర్వాత విలువైన సంబంధం కలిగి ఉండేది తండ్రికే. కూతురు-తండ్రి మధ్య బంధం అంటే ఎంతో బలంగా ఉంటుంది. కూతురికి తండ్రి అంటే గొప్ప నమ్మకం, ధైర్యం. కానీ అలాంటి తండ్రే ఓ కూతురి పట్ల కామ మృగాడిలా ప్రవర్తించాడు. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కూతురిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా.. తాను అత్యాచారానికి పాల్పడ్డ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని.. చెప్తే చంపేస్తానని కూతురిని… -
MLA Kadiyam: కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. సింహం త్వరలోనే బయటకు వస్తుంది.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జడ్పీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి సంతాప సభలో పాల్గొన్న అనంతరం ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారు.. బీఆర్ఎస్ సర్కార్ రావడం పెద్ద ఇబ్బంది కాదని తెలిపారు. కేసీఆర్ సింహాలా బయటకు వస్తారని.. సమయం చెప్పలేమని అన్నారు. -
Ayodhya Ram Mandir: రామమందిరం ప్రారంభోత్సవానికి ఆ స్టార్ క్రికెటర్లు..!
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి లెజెండరీ క్రికెట్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ హాజరుకానున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది. 2024 జనవరి 22న శ్రీరాముడితో పాటూ ఇతర దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
Cricket: T10 చరిత్రలో రికార్డు.. 43 బంతుల్లో 193 పరుగులు చేసిన స్పెయిన్ బ్యాట్స్మెన్
T10 చరిత్రలో రికార్డు సాధించాడు స్పెయిన్ బ్యాట్స్మెన్ హమ్జా సలీం దార్.. కేవలం 43 బంతుల్లో 193 పరుగులు చేశాడు. 449 స్ట్రైక్ రేట్తో.. అంటే ప్రతి బంతికి 4 పరుగుల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. స్పెయిన్లో జరుగుతున్న యూరోపియన్ క్రికెట్ సిరీస్లో హమ్జా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో.. టీ10 క్రికెట్ ఫార్మాట్లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన రికార్డు సృష్టించాడు. -
DGP: రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రేపు మధ్యాహ్నం 1. 04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచి ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని డీజీపీ రవిగుప్తా తెలిపారు. మరోవైపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు చెప్పారు. డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతికుమారి, సీపీ సందీప్ శాండిల్య, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ తదితరులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. -
Telangana Elections: తెలంగాణలో జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు
తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల పండగ మొదలవనుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదో.. ఇప్పుడు గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. అందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. కాగా.. సర్పంచుల పదవీ కాలం 2024 జనవరి 31వ తేదోతో ముగియనుంది. ఈ క్రమంలో సర్పంచులు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాల కోసం జిల్లాల వారీగా నివేదిక కోసం ఎలక్షన్… -
KCR: మాజీ సీఎం కేసీఆర్ను కలిసిన చింతమడక గ్రామస్తులు.. సీఎం సీఎం అంటూ నినాదాలు
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గరి నుంచి కేసీఆర్ అక్కడి నుంచి బయటకు రాలేదు. ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కాగా.. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. అయితే.. ఈరోజు కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు ఆయనను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వచ్చారు. -
MLC Kavitha: కేసీఆర్తో సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు
సింగరేణి ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ. వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కింగర్ల మల్లయ్య హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. ఈ సందర్భంగా.. అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నద్ధత గురించి చర్చలు జరిపారు. సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్పూర్తితో నాయకత్వ సారధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. -
Tragedy: బురదలో కూరుకుపోయిన అంబులెన్స్.. కడుపులో పసికందు మృతి
ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏజెన్సీలో చిన్న చినుకుపడితే చాలు రోడ్లన్నీ అధ్వాన్నంగా మారిపోతాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే.. గర్భిణీలకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే పురిటినొప్పులతో ఆ రోడ్లను దాటి వెళ్లడం సాధ్యం కాదు.. అంతకుమించి అక్కడికి ఏ వాహనాలు రావు. ఒకవేళ వచ్చినా, అందులో కూరుకుపోవాల్సిందే.
తాజావార్తలు
-
Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్పై వేటు?
-
Ketan Murder Case: కేతన్ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
-
Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్
-
Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
-
INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
ట్రెండింగ్
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!