Home
Telangana
Telangana News
-
Siddipet : యాప్తో బయటపడిన యూరియా మాఫియా..!
Siddipet : సిద్దిపేట జిల్లాలో యూరియా పంపిణీ వ్యవహారం వరుస అక్రమాలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వం పారదర్శకత కోసం తీసుకువచ్చిన యాప్, వ్యాపారుల అక్రమాలను బట్టబయలు చేస్తోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు వ్యాపారులు, రైతులకు అందాల్సిన యూరియాను పక్కదారి పట్టిస్తూ, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, వ్యాపారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేర్యాల ఘటన మరువకముందే.. బైరాన్ పల్లిలో మరో అక్రమం జిల్లాలోని చేర్యాలలో సుమారు 6,429 యూరియా బస్తాలు మాయమైన… -
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
Hyderabad: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. దంపతులు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడటంతో అటు వారి సొంత గ్రామంలోనూ, ఇటు వారు నివసిస్తున్న ప్రాంతంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీష దంపతులు ఘట్కేసర్–బీబీనగర్ రైల్వే మార్గంలోని ఎన్ఎఫ్సీ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
Jupally Krishna Rao: రాష్ట్ర అప్పులపై తాను ఇంతకు ముందు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడడం కాదు.. స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. తాను ఆత్మగౌరవం కోసం పని చేస్తానని.. తన ఉద్యోగాన్ని సైతం వదిలేసుకున్నానన్నారు. రాజకీయాలకు వచ్చింది మీలాగా అడ్డగోలుగా మాట్లాడటం కోసం కాదని మండిపడ్డారు. మిమ్మల్ని గౌరవంగా సంబోధిస్తున్నా.. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు… -
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
OTR: శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా? యాదాద్రికి కొత్త కమిటీని ప్రకటించి… భద్రాద్రి గురించి ఎందుకు పట్టించుకోలేదు? 14 ఏళ్ళ నుంచి పాలక మండలి లేకున్నా… రామయ్య గురించి రవ్వంతైనా ఎందుకు ఆలోచించడం లేదు? ఈ ఆలయం మారుమూల ప్రాంతంలో ఉందనా..? లేక జిల్లాకు చెందిన ముఖ్యుల మధ్య సమన్వయం లేకనా? ముగ్గురు కీలక మంత్రులు ఉన్నా… ఎందుకిలా జరుగుతోంది? రామా…. కనవేమిరా…. శ్రీ రఘురామ కనవేమిరా…. అంటూ ఇబ్బందుల్లో ఉన్న భక్తులు… -
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
Telangana Police : తెలంగాణ పోలీస్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి చెందిన దాదాపు 20 మంది మాజీ పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఉన్న పలువురు అధికారులకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పోలీస్ శాఖ పూర్తిగా తొలగించింది. ఈ జాబితాలో మాజీ డీజీపీలు స్వరజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మలతో పాటు పూర్ణచందర్రావు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,… -
Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
Rythu Bharosa 3rd Installment Released Today: తెలంగాణ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకం అమలును దశలవారీగా కొనసాగిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేశారు. అనంతరం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 44.28 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482 కోట్లు… -
Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన ఆర్థిక వ్యవహారాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకుల విద్యాసంస్థల్లో అవినీతి ఆరోపణలపై ఇరు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని గన్పార్క్ రాజకీయ కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు తెలంగాణ భవన్కు చేరుకుని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం… -
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
Congress vs BRS: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకుల విద్యాసంస్థల్లో అవినీతి ఆరోపణలపై ఇరు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గన్పార్క్ కేంద్రంగా రాజకీయ వేడి మరింత పెరిగింది. కాంగ్రెస్ తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ గన్పార్క్కు చేరుకుని చర్చకు… -
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
Rythu Bharosa: రాష్ట్రంలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్లోని శిల్పకళావేదిక వేదికగా అధికారికంగా విడుదల చేశారు. ఈ పథకం తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 44.28 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేసిందని సీఎం వెల్లడించారు. రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తమ… -
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
KTR: తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (K.T.R) సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం ఏర్పడిందని చెబుతూ కేటీఆర్ తనదైన శైలిలో ప్రతిస్పందించారు. సీఎం రేవంత్ వాడుతున్న భాష, చేస్తున్న వ్యాఖ్యలు ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తికి తగిన విధంగా లేవని విమర్శించారు. పనిచేయని నాయకులే ఎక్కువగా మాట్లాడుతారని, ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో…
తాజావార్తలు
-
Trump: తేడాలు చేస్తే ఒమన్ను కూడా లేపేస్తాం.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
-
Trump: ఇరాన్కు ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు దక్కనివ్వను.. ట్రంప్ శపథం
-
Shrasti Verma : బీజేపీలో చేరిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
-
E20 Ethanol Demand: E20 తర్వాత అసలు సవాలు ఏంటి?.. ఆహారం, నీటిపై ఒత్తిడి తప్పదా?
-
Minister Ponguleti: 22A నుంచి 32 వేల భూములకు విముక్తి.. నిషేధిత భూములపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!