కార్తీక మాసం సందర్భంగా భక్తులు శివాలయాల్లో విశిష్ట పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడలో కొలువైన శ్రీ రాజ రాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. కాగా రాజన్న ఆలయంలో కళ్యాణం అర్జిత సేవ టికెట్ల కోసం భక్తులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. స్వామి వారి నిత్య కళ్యాణం కోసం భక్తులు అర్ధరాత్రి నుండే టికెట్ కౌంటర్ వద్ద ఎముకలు కొరికే చచలిలో పడిగాపులు కాస్తున్నారు. మూడు రోజులుగా…
* శ్రీ సత్యసాయి: సత్య సాయి బాబా శతజయంతి వేడుకలు.. నేడు పుట్టపర్తికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు నారా లోకేష్, అనగాని, పయ్యావుల కేశవ్, అనిత, సత్యకుమార్ .. వీఐపీల తాకిడితో పుట్టపర్తిలో భారీ భద్రత ఏర్పాటు * తిరుమల: ఇవాళ టిటిడి పాలకమండలి సమావేశం.. వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు జారీ విధానంపై నిర్ణయం తీసుకోనున్న…
తెలంగాణలో మరో ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ ఇప్పట్నుంచే అభ్యర్థిని సిద్ధం చేస్తోందా? జూబ్లీహిల్స్లో తగిలిన దెబ్బ పునరావృతం అవకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తపడుతోందా? ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే….అభ్యర్థి ఎవరో ఆల్రెడీ డిసైడ్ చేసేసిందా? బైపోల్ గ్యారంటీ అనుకుంటున్న ఆ నియోజకవర్గం ఏది? ఇంత ముందుగానే పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డ ఆ నాయకుడు ఎవరు?. జూబ్లీహిల్స్ తర్వాత తెలంగాణలో ఉప ఎన్నిక జరగడానికి గట్టి అవకాశాలున్న వాటిలో ఖైరతాబాద్ ముందు వరుసలో ఉంది. 2023లో…
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని పేర్కొంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయని మంత్రివర్గ భేటీ స్పష్టం చేసింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. వారోత్సవాల సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. Also Read: Niloufer Cafe Babu…
శ్రీశైలంలో కార్తీక మాసం చివరి సోమవారం సందడి కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం తరలివచ్చారు. పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ, కార్తీక మాసం పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తూ భక్తులు శివనామ స్మరణలో తరిస్తున్నారు. భారీ రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు…
కార్తీక మాసం చివరి సోమవారం ఎఫెక్ట్.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు.. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో.. ఓవైపు నదీ తీరాలు.. మరోవైపు శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది.. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద భక్తుల సందడి అలముకుంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి తీరం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. పలు స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో ప్రవాహంలో వదిలి భక్తులు…
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ పై నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకు క్షమాపణలు చెప్పాలని CV ఆనంద్ ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో ట్వీట్స్ చేస్తున్నారు. వివరాల్లోకెళితే.. గత నెలలో తెలుగు సినిమా పరిశ్రమలోని అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులు, డిజిటల్ మూవీ కంపెనీలను, మూవీ పైరసీ ముఠాలను అరికట్టేందుకు హైదరాబాద్ నగర పోలీసు సైబర్ క్రైమ్ బృందంతో ముఖ్యమైన…
* హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ.. అందెశ్రీ స్మృతి వనం, అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్ * ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ.. తెలంగాణ స్పీకర్పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్.. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం పిటిషన్.. అన్ని కేసులపై నేడు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు * ఏపీలో…
HYDRA : బోడుప్పల్లోని సుద్దకుంట చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అకస్మిక పరిశీలన నిర్వహించారు. చెరువు వద్ద FTL పేరుతో HMDA, మున్సిపల్ అధికారులు ఇళ్లపై నెంబర్లు వేశారు, ఇనుప కడ్డీలు పెట్టి ప్రజల్లో భయాందోళనలకు గురిచేశారంటూ స్థానికులు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. 30 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, అకస్మాత్తుగా FTL పేరుతో తమపై ఒత్తిడి తేవడం అన్యాయం అని వారు వేదన వ్యక్తం చేశారు. స్థితిగతులను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్, ఇళ్లపై చేసిన…
డీజిల్ బస్సులకు గుడ్బై.. ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే..! డీజిల్ బస్సులకు గుడ్బై చెబుతున్నాం.. ఇకపై కొనే ప్రతి బస్సు ఎలక్ట్రిక్ బస్సే ఉంటుందన్నారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. విశాఖ ద్వారక ఆర్టీసీ బస్టాండ్లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్లో అందిస్తున్న సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. బస్సుల లభ్యత, శుభ్రత, టికెట్ వ్యవస్థ వంటి అంశాలపై ఆయన ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ముఖ్యంగా ఫ్రీ…