Home
Telangana
Telangana News
-
Telangana Weather: నైరుతి రుతుపవనాల్లో కదలిక.. దంచికొడుతున్న వర్షాలు.. ఈ మూడు రోజులు జాగ్రత్త!
Telangana Weather: మండే ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త చెప్పింది. బ్రేక్ పడిన నైరుతి రుతుపవనాల గమనంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. రానున్న 24 గంటల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాస్తవానికి జూన్ 8వ తేదీనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పుల వల్ల ముందుకు సాగలేదు. అయితే ప్రస్తుతం తమిళనాడు, రాయలసీమ మీదుగా… -
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
Bandi Bhagirath: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు న్యాయస్థానంలో ఉపశమనం లభించింది. ఓ యువతిపై లైంగిక దాడి కేసులో అరెస్టై చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న భగీరథ్కు మల్కాజ్గిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత కొన్ని రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న భగీరథ్ తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు బెయిల్… -
Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
Siddipet District: సిద్దిపేట జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత ఘోరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కన్నప్రేమను మరచి, కామంధుడైన ప్రియుడి కోసం ఒక కసాయి తల్లి చేసిన దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో అడ్డువచ్చాడని, ఏడుస్తున్నాడనే కక్షతో కేవలం రెండేళ్ల వయసున్న కన్న కుమారుడిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆపై బాబు ఫిట్స్తో చనిపోయాడంటూ భర్తను, బంధువులను నమ్మించి గుట్టుచూడకుండా అంత్యక్రియలు సైతం కానిచ్చేసింది. అయితే, పాపం పండినట్లు… -
Hyderabad: చిన్న పొరపాటు.. నిండు ప్రాణం బలి! పాము కాటుకు గురై వ్యాపారవేత్త మృతి..
Hyderabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఫామ్హౌస్లో జరిగిన ఘోర ప్రమాదం ఒక యువ వ్యాపారవేత్త ప్రాణాలను బలితీసుకుంది. రాజేంద్రనగర్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్ మొహిద్దీన్ హుస్సేని (30) సరదా కోసం చేసిన ఒక చిన్న పొరపాటు, ఆయన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. కేవలం నవ్వులాట కోసం అత్యంత విషపూరితమైన పామును చేతుల్లోకి తీసుకోవడం, ఆపై జరిగిన పరిణామాలు ఈ విషాదానికి దారితీశాయి. -
Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
Good News : తెలంగాణ ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో సరికొత్త డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు విద్యా రంగానికి సంబంధించిన సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా , సులభంగా అందించేందుకు ‘వాట్సాప్ (WhatsApp) ద్వారా పాఠశాల విద్యా సేవలను’ అధికారికంగా ప్రారంభించింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఈ నూతన వాట్సాప్ సేవలను తెలంగాణ గౌరవ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ… -
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
Gandhi Sarovar Project : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుండి కీలక అనుమతులు లభించాయి. హైదరాబాద్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాపు ఘాట్ వద్ద నిర్మించతలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పనులకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కీలకమైన క్లియరెన్స్ లభించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో సహకరించి, అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్ర… -
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
Grain Storage Silos: తెలంగాణ రాష్ట్రంలో ధాన్య కొనుగోలు, నిల్వ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ దిశగా సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధాన్య నిల్వ వ్యవస్థల ఏర్పాటుపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను శాస్త్రీయంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు, సంబంధిత ఏజెన్సీలతో మంత్రి విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలోని… -
Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
Secunderabad: సికింద్రాబాద్ సైనిక పరిపాలన ప్రాంతమైన కంటోన్మెంట్ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఏళ్ల తరబడి బానిసత్వపు ఆనవాళ్లుగా మిగిలిపోయిన బ్రిటిష్ కాలం నాటి పేర్లను చెరిపేస్తూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అత్యంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కంటోన్మెంట్ పరిధిలోని 21 ప్రధాన రోడ్లు, 3 బజార్లకు ఉన్న ఆంగ్లేయుల పేర్లను తొలగించి, వాటి స్థానంలో మన దేశ సార్వభౌమాధికారం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లు, దేశ గమనాన్ని మార్చిన మహనీయుల పేర్లను పెట్టాలని బోర్డు… -
Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో వైద్య వ్యవస్థలోని ఘోర నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. దేవుడిలా ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రి సిబ్బంది చేసిన క్షమించరాని తప్పు.. ఓ గర్భిణిని, ఆమె కడుపున పుట్టిన ఆడబిడ్డను అనంతలోకాలకు పంపింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బాధితుల కథనం ప్రకారం.. ఈ నెల 13న గుండాల గ్రామానికి చెందిన వనజ అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ… -
CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
CM Revanth Reddy : హైదరాబాద్ లోని గుర్రంగూడ ఎకో పార్క్లో మొక్క నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల రక్షణ, కబ్జాల నిరోధమే లక్ష్యంగా పనిచేస్తున్న ‘హైడ్రా’ (HYDRAA) పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలనే హైడ్రాను ఒక భూతంలా చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైడ్రా ఎప్పుడూ కూడా పేద ప్రజల జోలికి…
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!