* తిరువనంతపురం: ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదో టీ-20.. రాత్రి 7 గంటలకు గ్రీన్ఫీల్డ్ ఇంటరేషనల్ స్టేడియంలో ప్రారంభంకానున్న మ్యాచ్
* మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ను నియమించే అవకాశం.. ఇవాళ ఎన్సీపీ శాసనసభా పక్ష సమావేశంలో.. ఎల్పీ నేతగా సునేత్ర పవార్ను ఎన్నుకునే అవకాశం.. ఆ తర్వాత ఈ రోజు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు చెబుతున్న పార్టీ నేతలు..
* చిత్తూరు: కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన… ఉదయం 10 గంటలకు బెగ్గిలిపల్లె పంచాయతీలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం.. శాంతిపురం వద్ద ప్రజావేదిక బహిరంగంగా సభ… అక్కడే 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ కార్యక్రమం… కుప్పంలో ఏర్పాటు చేసే ఏడు కొత్త పరిశ్రమలతో మౌఖిక ఒప్పందాలు కుదుర్చుకునే కార్యక్రమం..
* తెలంగాణలో నిన్నటితో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు.. ఈ రోజు నామినేషన్ల స్క్రూటిని
* ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయాల వద్ద పూజలు.. తిరుమల లడ్డూపై చంద్రబాబు ఘోర అపచారాలకు.. పరిహారంగా పూజలు.. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఘోర అపచారాలకు పాల్పడ్డారంటున్న వైసీపీ..
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో మాఘ మాస పౌర్ణమి గరుడ సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* తిరుమల: రేపు రామకృష్ణ తీర్ద ముక్కోటి.. రేపు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనున్న టీటీడీ.. రేపు గోగర్బం డ్యాం వరకు మాత్రమే ప్రవైట్ వాహనాలను అనుమతించనున్న టీటీడీ
* శ్రీ సత్యసాయి : గోరంట్ల మండలం వడిగేపల్లి గ్రామంలో పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సవిత, రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్..
* అనంతపురం : ఆర్డిటి స్టేడియం లో అనంత సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్. పాల్గొననున్న సినీ నటులు.
* అనంతపురం : తిరుపతి లడ్డుపై దుష్ప్రచారం చేయడానికి వ్యతిరేకిస్తూ గుంతకల్లు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న వైసీపీ నేతలు.
* అనంతపురం : గుత్తి మండలం తొండపాడు బొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా 6 వ రోజు స్వామివారికి ఆలయంలో విశేష పూజలు, ఇవాళ స్వామివారి ఉత్సవమూర్తులకు గజ వాహనంపై కొలువు తీర్చి ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవం.
* అనంతపురం : గుత్తిలో రూ.5 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించునున్న ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్ .
* గుంటూరు: నేడు గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నేతలకు మంచి బుద్ది ప్రసాదించాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక పూజలు.
* నేడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.
* తూర్పుగోదావరి జిల్లా: ఇవాళ జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయాల వద్ద వైసీపీ శ్రేణులు, పూజా కార్యక్రమాలు .. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో తిరుమల లడ్డూ పై…చంద్రబాబు ఘోర అపచారాలు – పరిహార పూజల కార్యక్రమం
* కర్నూలు: కోడుమూరులో శ్రీ చౌడేశ్వరిదేవి తిరునాళ్ల మహోత్సవాలలో నేడు ప్రభోత్సవం
* శ్రీశైలంలో నేటి నుండి సామాన్య భక్తులకు అధిక సమయం శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అవకాశం.. శని, ఆది, సోమ, ప్రభుత్వ సెలవులలో శ్రీస్వామివారి స్పర్శ దర్శనం ఉదయం, రాత్రి మాత్రమే దర్శించుకునే అవకాశం.. మిగిలిన సమయమంతా శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం.. సామాన్య భక్తులకు త్వరగతిన దర్శనం అయ్యేలా నిర్ణయం తీసుకున్న చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు
* తూర్పుగోదావరి జిల్లా: నిడదవోలు 10వ వార్డు రజకుల వీధిలో. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్న మంత్రి కందుల దుర్గేష్
* విజయనగరం: గజపతినగరం మండలంలో జిన్నాం గ్రామంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్…
* విజయనగరం: గజపతినగరంలోని బజారు జంక్షన్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో నేడు ప్రత్యేక పూజలు.. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం అధికార పక్షం చెసిన ఆరోపణలు నిజం కాదని తేలడంతో ఆనందోత్సవాలు….
* విజయనగరం: నేడు నగరంలోని టీటీడీ కళ్యాణమండం వద్ద లడ్డూ ప్రసాదం ఆంశంపై మాజీ డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం.. పాల్గొననున్న వైసీపీ శ్రేణులు..
* తిరుమల: 12 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,254 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,954 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ. 4.35 కోట్లు