Off The Record: కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఆసక్తి గా ఎదురు చూస్తోంది. మరీ ముఖ్యంగా ఆ ప్రభావం తెలంగాణ మీద ఎక్కువగా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు ఇక్కడి కమలనాధులు. దాన్ని బట్టి రాజకీయ సమీకరణలు సైతం మారతాయన్న చర్చోపచర్చలు పార్టీలో జరుగుతున్నాయి. కన్నడ నాట గెలిస్తే తెలంగాణలో రెట్టించిన ఉత్సాహంతో పని చేయవచ్చని, ఓడితే మోరల్గా దెబ్బ పడుతుందని మాట్లాడుకుంటున్నారు టి బీజేపీ నాయకులు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణే అనుకుంటున్న తమకు…
Off The Record: ఇటీవల నల్గొండ నిరుద్యోగ నిరసన సభ జరిగినప్పుడు మీడియాతో చిట్చాట్ చేసిన సీనియర్ లీడర్ జానారెడ్డివచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పారు. తన స్థానంలోకుమారుడు బరిలో నిలుస్తారని చెప్పారు. కానీ.. ఇద్దరు కొడుకులు రఘువీర్, జయవీర్లో ఎవరన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనే.. కుమారుడిని బరిలో దింపాలని అనుకున్నా… పార్టీ అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జానానే నేరుగా పోటీకి దిగారు. వచ్చే సాధారణ ఎన్నికలు కూడా కాంగ్రెస్…
Off The Record: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే.. స్పీడ్ పెంచుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ …. హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్ళూరుతోంది. ఇటీవల జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలకు నేతలను సమయాత్తం చేశారు సీఎం కేసీఆర్. మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేది మనమే అని కేసీఆర్ లెక్కలతో సహా వివరంగా చెప్పడంతో… పార్టీలో అసెంబ్లీ…
బాబు, పవన్ పొలిటికల్ టూరిస్టులు.. రైతుల దగ్గర నటిస్తున్నారు..! టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి.. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు. పవన్ కల్యాణ్ను రైతులపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. అసలు పవన్ కు రాజకీయ అవగాహన లేదన్న ఆయన.. చంద్రబాబు హయాంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. మరి అప్పుడు పవన్ ఎందుకు మాట్లాడ లేదు?…
కర్ణాటక ఫలితాలపై జోరుగా బెట్టింగ్.. గెలుపెవరిది..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు..? కర్ణాటక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసింది.. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కర్ణాటక ఎన్నికలపై ఆది నుంచి తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్ సాగుతోంది.. ఇక, పోలింగ్ ముగిసిన తర్వాత.. కర్ణాటకలో గెలుపెవరిది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటూ బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.. పోలింగ్ ముందు వరకు ఒక అంచనాతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు.. పోలింగ్…
కృష్ణా జలాల్లో నీటి వాటాలను తేల్చకుండానే కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. నదీ జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాలని తెలంగాణ వాదిస్తే.. 66:34 నిష్పత్తిలో ఉండాలని ఏపీ వాదిస్తోంది. ఇదిలా ఉండగా.. కేంద్రం తొమ్మిదేళ్ల నుంచి నీటి వాటాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది.