Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. మూడు రోజులు వానలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert to Telugu States: భానుడి ప్రతాపంతో ఉక్కపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్లు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిని వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నైరుతి గాలుల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని, ఏపీలో నేడు, రేపు, ఎల్లుండి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చేతికొచ్చిన పంట ఎక్కడ నేలరాలిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు.
Read Also: KOLORS Shocks: వెయిట్ లాస్ పేరుతో విద్యుత్ షాకులు.. నిర్లక్ష్యపు థెరపీతో ప్రాణాలకు ముప్పు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయని వివరించింది. ఇదిలా ఉండగా.. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నేడు పెరిగే అవకాశం ఉందని.. రేపటి నుంచి 2 నుంచి 4 సెంటిగ్రేడ్ల తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు భారీ అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర వాసులను శుక్రవారం వరుణుడు కనికరించాడు. పలు ప్రాంతాల్లో సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది. ఇదిలా ఉండగా.. జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులను ముంచేశాయి. ఇప్పటికే రైతులు వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తుండగా.. ఈ వర్షంగా కారణంగా ధాన్యం కుప్పలు తడిచిపోయాయి. చాలా మంది రైతులు ఇంకా వరికోతలు కోయలేదు. దీనివల్ల వారికి ఈ అకాల వర్షం ఆటంకం కలిగించింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!