Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. మూడు రోజులు వానలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert to Telugu States: భానుడి ప్రతాపంతో ఉక్కపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్లు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిని వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నైరుతి గాలుల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని, ఏపీలో నేడు, రేపు, ఎల్లుండి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చేతికొచ్చిన పంట ఎక్కడ నేలరాలిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు.
Read Also: KOLORS Shocks: వెయిట్ లాస్ పేరుతో విద్యుత్ షాకులు.. నిర్లక్ష్యపు థెరపీతో ప్రాణాలకు ముప్పు
Also Read
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయని వివరించింది. ఇదిలా ఉండగా.. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నేడు పెరిగే అవకాశం ఉందని.. రేపటి నుంచి 2 నుంచి 4 సెంటిగ్రేడ్ల తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు భారీ అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర వాసులను శుక్రవారం వరుణుడు కనికరించాడు. పలు ప్రాంతాల్లో సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది. ఇదిలా ఉండగా.. జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులను ముంచేశాయి. ఇప్పటికే రైతులు వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తుండగా.. ఈ వర్షంగా కారణంగా ధాన్యం కుప్పలు తడిచిపోయాయి. చాలా మంది రైతులు ఇంకా వరికోతలు కోయలేదు. దీనివల్ల వారికి ఈ అకాల వర్షం ఆటంకం కలిగించింది.
తాజావార్తలు
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!