Bhatti Vikramarka : రైతులకు గుడ్న్యూస్.. వ్యవసాయ మోటర్లకు సోలార్ పవర్..!
- ఇంటికే విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చే సోలార్ ప్రాజెక్ట్
- సోలార్ ద్వారా విద్యుత్ అమ్మకం.. కుటుంబాలకు వార్షిక ఆదాయం
- వ్యవసాయ మోటర్లకు సోలార్ పవర్తో రైతులకు డబుల్ లాభం
- గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహంతో పర్యావరణానికి కూడా మేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని రావినూతల గ్రామం సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త సోలార్ విప్లవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం ప్రతి ఇంటిని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చడమేనని, ఇకపై ప్రజలు విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించే రోజులు పోయి, విద్యుత్ శాఖే ప్రజలకు డబ్బులు చెల్లించే రోజులు వచ్చాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అత్యంత భారీగా నిధులను వెచ్చిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 81 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేస్తుండగా, ఒక్క బోనకల్ మండల పరిధిలోనే 306 కోట్ల రూపాయలను కేటాయించారు. అందులోనూ రావినూతల గ్రామంలోని ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థల ఏర్పాటు కోసమే 24 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం.
Medaram: మేడారంలో ఆదివాసీల జీవన విధానం ఉట్టిపడేలా శిలాఫలకాలు
Also Read
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
ఈ పథకం ద్వారా ప్రజలకు చేకూరే ఆర్థిక ప్రయోజనాలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రతి కుటుంబం తమ ఇంటిపై ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసుకుని, తమ అవసరాలకు వాడుకోగా మిగిలిన కరెంటును ప్రభుత్వానికి విక్రయించవచ్చు. ఇలా విక్రయించిన ప్రతి యూనిట్కు ప్రభుత్వం రూ. 2.57 పైసల చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. దీనివల్ల ప్రతి ఇంటికి ఏడాదికి సుమారు 15 వేల రూపాయల వరకు విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా, అదనపు విద్యుత్ అమ్మకం ద్వారా మరో 5 వేల రూపాయల వరకు నగదు ఆదాయం లభిస్తుంది. అంటే ప్రతి ఏటా ఒక కుటుంబం సుమారు 20 వేల రూపాయల ఆర్థిక వెసులుబాటును పొందుతుంది. ఈ మొత్తాన్ని మహిళలు తమ పిల్లల చదువులకో లేదా ఇతర ఇంటి అవసరాలకో వాడుకోవచ్చని భట్టి విక్రమార్క సూచించారు.
కేవలం గృహ వినియోగదారులకే కాకుండా, రైతులకు కూడా ఈ పథకం ద్వారా ‘డబుల్ ధమాకా’ లభించనుంది. పొలాల్లోని వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం తన సొంత ఖర్చుతో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తుంది. పంట లేని సమయంలో లేదా మోటార్లు వాడనప్పుడు కూడా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కలుగుతుంది. అంతేకాకుండా, ఈ సోలార్ ప్యానెళ్లను ఎనిమిది అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయడం వల్ల వాటి కింద ఒక పక్కా షెడ్డు లాంటి వసతి ఏర్పడుతుంది. అక్కడ రైతులు పశువులను కట్టుకోవడానికి, వ్యవసాయ పరికరాలు దాచుకోవడానికి లేదా మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి వీలుంటుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘గ్రీన్ ఎనర్జీ’ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, రైతులు కూడా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పొలాల్లో చెత్తను కాల్చవద్దని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు.
CM Switzerland visit: సీఎం అండ్ టీం బిజీబిజీ.. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చలు..!
తాజావార్తలు
-
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
-
mAadhaar app: ఎమ్-ఆధార్ యాప్కు గుడ్బై.. నేటి నుంచి పాత యాప్ సేవలు నిలిపివేత.. కొత్త Aadhaar యాప్లో అదిరే ఫీచర్లు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!