Rajanna Siricilla Medical College: రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీకి అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Siricilla Medical College: ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగు పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. దీంతో మరో వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతుల నిర్వహణకు అనుమతి లభించింది. గతేడాది 8, ఈ ఒక్క ఏడాదిలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించాలనేది సీఎం కేసీఆర్ ధ్యేయం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా వేగంగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీకి అనుమతి రావడంతో మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. వంద ఎంబీబీఎస్ సీట్లకు ఆమోదం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ఏడు కాలేజీలకు అనుమతి వచ్చిందన్నారు. ఆరోగ్య తెలంగాణలో భాగంగా జిల్లాకో మెడికల్ కాలేజీతో సీఎం కేసీఆర్ ఆశయం విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు.
2023-24 విద్యా సంవత్సరం నుంచి 100 ఎంబీబీఎస్ విద్యార్థుల వార్షిక ప్రవేశంతో మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి అనుమతిని ఇస్తూ.. ఎన్ఎంసీ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా అవసరమైన బోధనా సిబ్బందిని. ప్రాథమిక సౌకర్యాలను నియమించాలని కోరింది. జిల్లా వైద్య కళాశాల కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, వరంగల్ పరిధిలో పనిచేస్తుంది.
Also Read
- Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
Read Also: KTR: మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ కార్యక్రమం నుంచి ఆహ్వానం
అనుమతి లభించినందుకు సంతోషం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుకు సిరిసిల్ల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.స్థానిక ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నందున సిరిసిల్ల ప్రజలు ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతుంటారని ఆయన అన్నారు. జిల్లా ప్రజలపై ప్రత్యేక అభిమానంతో చంద్రశేఖర్రావు జిల్లా కేంద్ర ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటు జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేశారు. మరోవైపు శాశ్వత వైద్య కళాశాల భవన నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
తాజావార్తలు
-
Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
-
He-Man: హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్ఫుల్ ఎంట్రీ!
-
Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
-
Kantamaneni Ravi Shankar: పంచభూతాలపై టాలీవుడ్ లో కొత్త సినిమా
-
CM Vijay: సీఎం విజయ్కి షాక్ ఇచ్చిన మిత్రపక్షాలు.. ‘రెండు ఆకుల’ రాజకీయంలో దళపతి వెనకడుగు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!