Rajanna Siricilla Medical College: రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీకి అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Siricilla Medical College: ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగు పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. దీంతో మరో వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతుల నిర్వహణకు అనుమతి లభించింది. గతేడాది 8, ఈ ఒక్క ఏడాదిలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించాలనేది సీఎం కేసీఆర్ ధ్యేయం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా వేగంగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీకి అనుమతి రావడంతో మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. వంద ఎంబీబీఎస్ సీట్లకు ఆమోదం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ఏడు కాలేజీలకు అనుమతి వచ్చిందన్నారు. ఆరోగ్య తెలంగాణలో భాగంగా జిల్లాకో మెడికల్ కాలేజీతో సీఎం కేసీఆర్ ఆశయం విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు.
2023-24 విద్యా సంవత్సరం నుంచి 100 ఎంబీబీఎస్ విద్యార్థుల వార్షిక ప్రవేశంతో మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి అనుమతిని ఇస్తూ.. ఎన్ఎంసీ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా అవసరమైన బోధనా సిబ్బందిని. ప్రాథమిక సౌకర్యాలను నియమించాలని కోరింది. జిల్లా వైద్య కళాశాల కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, వరంగల్ పరిధిలో పనిచేస్తుంది.
Also Read
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
Read Also: KTR: మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ కార్యక్రమం నుంచి ఆహ్వానం
అనుమతి లభించినందుకు సంతోషం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుకు సిరిసిల్ల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.స్థానిక ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నందున సిరిసిల్ల ప్రజలు ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతుంటారని ఆయన అన్నారు. జిల్లా ప్రజలపై ప్రత్యేక అభిమానంతో చంద్రశేఖర్రావు జిల్లా కేంద్ర ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటు జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేశారు. మరోవైపు శాశ్వత వైద్య కళాశాల భవన నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
తాజావార్తలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
-
TheParadise : నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
-
AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం…
-
Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!