Lok Sabha Elections: తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు ఈసీ శుభవార్త చెప్పింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చని సీఈసీ వికాస్ రాజ్ తెలిపారు.
హామీలు నెరవేర్చని కాంగ్రెస్ను ఇంటికి పంపించాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు తరపున గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Lok Sabha Elections 2024: తెలంగాణ సరిహద్దు, మావోయిస్టు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఛత్తీస్గఢ్లోని బస్తర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్ ఎంపీ స్థానాల్లో తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎంపీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.. నామినేషన్లు ఆన్లైన్ లో కూడా సమర్పించవచ్చు.. నామినేషన్ పత్రాలు ప్రింట్ తీసి 24 ఏప్రిల్ వరకు ఆర్వోకు అందజేయాలన్నారు.
104 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మన ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు.. అలాంటిది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్ సర్కార్ ను బీజేపీ వాళ్లు బతకానిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు.