KRMB Meeting: నేడు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిమెన్ కమిటీ నేడు (గురువారం) ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు బోర్డు ఇరు రాష్ట్రాలకు లేఖ రాసింది. కమిటీలో బోర్డు మెంబర్ సెక్రటరీ, ఇరు రాష్ర్టాలు ఈఏన్సీలు సభ్యులుగా ఉండనున్నారు. త్రిసభ్య కమిటీ గత అక్టోబర్లోనే భేటీ అయింది.. రెండు రిజర్వాయర్లలో దాదాపు 82కి పైగా టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అందులో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలను కేఆర్ఎంబీ కేటాయించింది. మిగిలిన 2 టీఎంసీలను మే నెల తర్వాత భవిష్యత్ అవసరాలకు ఉపయోగించాలని చెప్పింది. అయితే, తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి నీటిని వినియోగించుకుంది.
Read Also: IPL 2024: ముంబై ఇండియన్స్కు గుడ్న్యూస్.. సూర్య వచ్చేస్తున్నాడు!
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
కాగా, ఏపీ తన కోటాలో 42 టీఎంసీలను వినియోగించుకోగా, మరో 3 టీఎంసీలు మిగిలి ఉన్నాయని కేఆర్ఎంబీకి తెలిపింది. అయితే, ఏప్రిల్లో మరో 5 టీఎంసీలను విడుదల చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేఆర్ఎంబీకి లేటర్ రాసింది. కోటాకు మించి 2టీఎంసీలను కోరుతుంది. ఈ నేపథ్యంలో త్రిమెన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఇక, కేఆర్ఎంబీ నిర్వహించే త్రీ మెంబర్ కమిటీ సమావేశానికి హాజరుకాలేమని రెండు రాష్ట్రాలు కేఆర్ఎంబీకి లెటర్ రాసినట్టు సమాచారం. తెలంగాణ ఈఎన్సీ (జనరల్) లీవ్ లో ఉండడంతో ఈ మీటింగ్ కు రాలేకపోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ నుంచి అధికారులు రాకపోవడంతోతాము కూడా సమావేశానికి అటెండ్ కావడం లేదని కేఆర్ఎంబీకి ఏపీ కూడా లేఖ రాసినట్టు సమాచారం. రెండు రాష్ట్రాలు రాసిన లేఖలపై కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్ఎంబీ అధికారులు లెటర్ రాసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!