అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. రెండు గంటల 25 నిమిషాల పాటు మాట్లాడారు. సీఎం రేవంత్ ప్రసంగంలో భాగంగా సోషల్ మీడియాలో పోస్టులపై కన్నెర్రజేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.
తెలంగాణలో అధికార పార్టీ నేతలకు అధికారులే టార్గెట్ అయ్యారా? సీఎం, పీసీసీ అధ్యక్షుడి నుంచి మొదలుపెట్టి కింది స్థాయి ఎందుకు అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా… అధికార యంత్రాంగం మీద గ్రిప్ రాలేదా? లేక ప్రభుత్వ సిబ్బందే కాంగ్రెస్ నేతల్ని లైట్ తీసుకుంటున్నారా? సర్కార్లో అసలేం జరుగుతోంది? తెలంగాణలో అధికారుల మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మార్వో నుంచి ఐఏఎస్ దాకా ఎవరూ సక్రమంగా పనిచేయడం లేదని అధికార పార్టీ నాయకులే…
Holi 2025 : హోలీ అంటేనే రంగురంగుల పండుగ ..ఈ పండుగ అంటానే మజా ఉంటుంది ..ఆ మజా వెనకాల కిక్కు ఒకటి ఉంటుంది ..మన భాషలో చెప్పాలంటే గంజాయి. గంజాయిని నేరుగా తీసుకుంటే అది నేరమవుతుంది.. అయితే హోలీ సమయంలో కిక్ వచ్చే రూపంలో తీసుకుంటే అది తిను పదార్థం అవుతుంది.. పాత బస్తీలో బేగంబజార్ దూలిపేట కార్వాన్ లాంటి ప్రాంతాల్లో కిక్కు వచ్చే గంజాయిని వివిధ రకాలుగా తయారుచేసి అమ్ముతుంటారు.. దానిమీద ఎప్పుడు అధికారులు…
గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. డిసెంబర్ 2022 లో 1388 పోస్ట్ భర్తీకి గ్రూప్ -3 నోటిఫికేషన్ విడుదలవగా.. 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) పరీక్ష రాశారు. ఫలితాలతో పాటే ఫైనల్ కీ, అభ్యర్థుల లాగిన్ ఐడీలకు OMR షీట్స్ కూడా పంపించారు.…
Ponnam Prabhakar: చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి అయితే, సభ మొత్తానికి అధిపతి స్పీకర్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అటువంటి స్పీకర్ ని పట్టుకొని సభ మీ ఒక్కడిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.
సీఎం ఆదేశించినా.. పాలకమండలి నిర్ణయం తీసుకున్నా.. టీటీడీ అధికారులు ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రశ్నించారు రఘునందన్.. తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష తగదన్న ఆయన.. పాలకమండలి అత్యవసర సమావేశమై నిర్ణయం అమలు చేయాలని సూచించారు.. వేసవి సెలవులో సిఫార్సు లేఖలు ఇస్తాం.. పరిగణలోకి తీసుకోకపోతే.. తెలంగాణ ప్రజాప్రతినిధులం అందరం తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్రావు..