ఆ ఎమ్మెల్యే వ్యూహం మార్చేశారా..? ముఖ్య నాయకత్వంతో గ్యాప్ పెంచుకోవడం ఎందుకు అని డిసైడ్ అయ్యారా..!? వీలైనంత వరకు తగ్గించుకుని, కుదిరితే ప్యాచప్ చేసుకుంటేనే ఉపయోగం తప్ప…. తెగేదాకా లాగితే ఉపయోగం ఏముందన్న రియలైజేషన్కు వచ్చారా? అందుకే కీలకమైన సమయంలో అత్యంత కీలకభేటా జరిపారా? ఎవరా శాసనసభ్యుడు? ఎవరితో కీలక భేటీ వేశారు? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సమావేశం అవడం ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీసింది. 15 నిమిషాలకు…
తెలంగాణ బీజేపీలో యాక్షన్ సీక్వెల్ మొదలవబోతోందా? పార్టీ పెద్దలు గట్టిగానే కత్తులు నూరుతున్నారా? పూర్తి ప్రక్షాళనకు సమయం ఆసన్నమైనట్టు భావిస్తున్నారా? దొరికిన డబ్బును దొరికినట్టు బొక్కేస్తున్న వాళ్ళ మీద వేటేయడానికి రంగం సిద్ధమైందా? ఎవరా నాయకులు? వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని అనుకుంటోంది నాయకత్వం? కమలంలో క్రమశిక్షణ లోపిస్తోందా? కొందరు జిల్లా అధ్యక్షుల పని తీరు బాగాలేదా…? ఎన్నికల డబ్బును కూడా మిస్యూజ్ చేశారా అంటే… అన్ని ప్రశ్నలకు ఎస్ అన్నదే పార్టీ వర్గాల మాట.…
Telangana Cabinet Meeting: ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండగా, మరోవైపు నేడు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో సుమారు 10 కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్-1లో ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సభలో ప్రవేశపెట్టబోయే పలు డ్రాఫ్ట్ బిల్లులపై చర్చించి, వాటికి తుది…
* ఢిల్లీ: ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు.. నవమి సందర్భంగా 26న పార్లమెంట్కు సెలవు.. సాయుధ పోలీసు బలగాల సాధారణ పరిపాలన బిల్లు-2026ను ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్షా * నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్రమంత్రి కుమారస్వామి క్షేత్రస్థాయి పర్యటన.. మేనేజ్మెంట్, కార్మిక సంఘాలతో వేర్వేరుగ సమావేశం అయ్యే అవకాశం.. ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత పరిశ్రమ పురోగతి, ఇతర సమస్యలపై చర్చించనున్న మంత్రి..…
Singareni Coal Production: యుద్ధ ప్రభావం సింగరేణి మీద పడింది. ఉత్పత్తిలో టార్గెట్ ను రీచ్ కాలేకపోతుంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి దానికి యుద్ధానికి లింక్ ఏంటి యాజమాన్యం ఏమంటుంది? ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ దేశానికే తలమాణికం. ఇది పారిశ్రామికీకరణతో పాటు అనేక ధర్మల విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్న 12 ఏరియాల్లో…
* ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. చమురు కొరతను అధిగమించడానికి చర్యలు.. 30 రోజులపాటు ఆంక్షల సడలింపు.. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు అమలు.. రెండు వారాల్లో మూడోసారి ఆంక్షలు సడలించిన అమెరికా * త్వరలో తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని.. హైదరాబాద్ లో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న బీజేపీ.. పరేడ్ గ్రౌండ్ లో సభ ఉండే అవకాశం… * ఇవాళ…
Crime News: భార్య, భర్త మధ్య విభేదాలు, మనస్ఫర్థలు.. అనుమానాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. కారణాలు ఏవైనా ఒక్కోసారి పరిస్థితులు చేయిదాటి పోతున్నాయి. హత్యలు లేదా ఆత్మహత్యలు చేసుకోవడంతో పచ్చని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఊర్లో బంధువుల వాదన…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పెట్టబోతున్న కొత్త పార్టీ పేరు ఖరారైందా? ముహూర్తం విషయంలో కూడా దాదాపు క్లారీటీ వచ్చేసిందా? పెద్దగా టైం తీసుకోకుండా…. పార్టీ ప్రకటన తర్వాత వెంటనే ఎన్నికల యుద్దంలోకి దిగేందుకు కూడా ప్లాన్స్ సిద్ధమవుతున్నాయా? పార్టీ ఇంకా పుట్టకముందే ఏ యుద్ధం కోసం సిద్ధమవుతోంది? ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ పెడుతున్నారన్న మాటలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నా… ఇప్పటిదాకా ఎక్కడా క్లారిటీ లేదు. బీఆర్ఎస్…
బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిభింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్ ను ఆవిష్కరిస్తూ… రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం చరిత్రాత్మకం అని కొనియాడారు. ఆయన చేసిన ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు. తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి అని సీఎం…
కల్తీకి కాదేది అనర్హం అని నిరూపిస్తున్నారు కేటుగాళ్లు, కల్తీ పాలు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, చాయపత్త, పన్నీర్ ఇలా పలు రకాల ఆహార పదార్థాలను పలు రకాల రసాయనాలను ఉపయోగించి కల్తీ ఆహారపదార్ధాలను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఈజీగా మనీ సంపాదించుకునేందుకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో వేల కిలోల్లో కల్తీ పన్నీర్ బయటపడడంతో అధికారులతో సహా అంతా షాక్…