నిన్నటి తెలంగాణ & పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి సౌరాష్ట్ర వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీన పడినవి. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు నైరుతి దిశ నుండి తెలంగాణా రాష్ట్రం లోనికి వస్తున్నవి. ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు ప్రదేశాల్లో రేపు కొన్ని ప్రదేశాలలో, ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వచ్చే అవకాశములు ఉన్నాయి. వాతావరణ హెచ్చరికలు:- రేపు, ఎల్లుండి భారీ వర్షములు…
తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ ప్రత్యేకమే. పీసీసీ వస్తుందని.. ఇన్నాళ్లూ కాన్ఫిడెన్స్తో ఉన్న వెంకన్నకి అధిష్ఠానం హ్యాండ్ ఇచ్చింది. ఆయన బరస్ట్ అయ్యారు కూడా. మరి.. రాజకీయంగా అన్నదమ్ముల దారెటు? ఇద్దరూ ఒకేవైపు అడుగులు వేస్తారా.. ఇంకేదైనా ప్లాన్స్ ఉన్నాయా? కోమటిరెడ్డి బ్రదర్స్ దారెటు? తెలంగాణ PCC నియామకంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వర్గం అసంతృప్తితో ఉంది. ఢిల్లీ నుండి హైదరాబాద్కి వచ్చిన ఆయన…ఎయిర్పోర్టులో చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్…
బీజేపీ వద్దన్నా.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అఖిలపక్ష సమావేశానికి వెళ్లారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన ఆయనపై చర్యలు ఉంటాయా? కాషాయ శిబిరాన్ని వదిలేయడానికే.. మోత్కుపల్లి ఈ ఎత్తుగడ వేశారా? పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? మాజీ మంత్రి వివరణపై బీజేపీ సంతృప్తి చెందిదా.. లేదా? బీజేపీకి దూరం అయ్యారన్న అభిప్రాయం ఉందట టీడీపీని వీడి.. కాషాయ కండువా కప్పుకొన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు.. కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రెస్…
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షునిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి నియామకం పట్ల ములుగు ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా కలిసి పనిచేస్తారని సీతక్క ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు సీతక్క మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. ఊరేగింపుగా వెళ్లిన సీతక్క వన దేవతలను దర్శించుకొని.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షునితో పాటు అయిదుగురు కార్యనిర్వాహక…
తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు అవార్డు సొంతం చేసుకున్నాడు.. గ్రామాలను స్వయం సమృద్ధిగా మార్చడానికి ఇనిషియేటివ్ చేసినందుకుగానూ హిమాన్షును ‘డయానా’ అవార్డు వరించింది… ఈ సందర్భంగా తనకు గైడ్గా ఉన్న తన తాత సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు హిమాన్షు.. కాగా, ‘శోమ’ పేరుతో రూపొందించిన ఒక వీడియోలో.. హిమాన్షు.. తన ఉద్దేశాలను వివరించారు. దానిలో.. అతను ఆహార ఉత్పత్తులలో కల్తీ గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాడు.. అంతేకాదు.. కల్తీ…
తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి, వారి జీవితాల్లో గుణాత్మకమార్పును రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నదని, తమ లక్ష్యసాధనలో దళిత మేధావి వర్గం కదలిరావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. 1200 కోట్ల రూపాయలతో ప్రారంభించి, రానున్న కాలంలో 40 వేల కోట్లతో అమలు చేయబోతున్న ‘సిఎం దళిత సాధికారత పథకం’ కోసం పటిష్టమైన కార్యాచరణ ను రూపొందిస్తున్నామని, అందుకు తగు సూచనలు సలహాలు అందించాలని, తనను కలిసి ధన్యవాదాలు తెలిపిన…
వ్యాక్సిన్ నేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.. ప్రాధాన్యత ప్రకారం వ్యాక్సినేషన్ చేస్తూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇస్తుండగా.. ఇప్పుడు విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లేవారికి వ్యాక్సిన్పై గైడ్లైన్స్ విడుదల చేశారు.. ఉద్యోగ అవసరాలపై విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్టు ప్రకటించింది ఆరోగ్య శాఖ.. విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లేవారు పాస్ పోర్ట్, వర్క్ పర్మిట్ వీసాలను చూపించి ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా పొందవచ్చని…
గతంతో పోలిస్తే… తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,21, 606 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 13,869 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 9 మంది మృతి చెందారు. read also…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదం మళ్లీ రాజుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది. ఈ నీటి వివాదంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ… తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ”వైఎస్ రాజశేఖర్ రెడ్డి దొంగ అయితే… సీఎం జగన్ గజ దొంగ” అన్న సందర్భాలు ఉన్నాయి. అటు ఏపీ మంత్రులు కూడా అదే స్థాయిలో తెలంగాణ ప్రభుత్వపై…
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇకపై రాజకీయపరమైన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించారు.. కేవలం ప్రజా సమస్యలు తీర్చేందుకు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని ప్రకటించిన ఆయన.. తనను రాజకీయాల్లోకి లాగవద్దు అని విజ్ఞప్తి చేశారు.. ఇక నుంచి భువనగిరి, నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి అక్కడ తిష్ట వేసిన సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేస్తానని వెల్లడించారు కోమటిరెడ్డి… గ్రామాల అభివృద్దికి…