తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై ఇరురాష్ట్రాల మంత్రులు ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇరు రాష్ర్టాల మధ్య నీటి పంచాయితీకి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆకతాయి పిల్లాడిలా వ్యవహరించి , కేంద్ర బలగాలను కోరడం వారి చేతగాని తనంకు నిదర్శనం అన్నారు. ఏపీ ప్రభుత్వం ముందుగా జీవో 203 ను ఉపసహరించుకోవాలి. పొరుగు రాష్ట్రం స్నేహ హస్తం ఇచ్చినా దాన్ని…
తెలంగాణలో పాదయాత్ర సీజన్ వచ్చేస్తోంది.. కొత్తగా పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారని తెలుస్తుండగా… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే పాదయాత్ర తేదీని ప్రకటించారు.. మరోవైపు.. తాజాగా వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల కూడా.. రేపోమాపో పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేస్తారనే ప్రచారం సాగుతోంది.. ఇప్పుడు ఈ జాబితాలోకి మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా చేరారు.. తనపై అభియోగాలు…
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్న పాలకులు.. మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు.. అయితే, ఈ తరుణంలో సర్కార్ కొలువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి… నాగర్కర్నూల్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న అందరికీ సర్కారు నౌకరి రాదని వ్యాఖ్యానించారు.. అంతేకాదు, కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ పని ఉపాధి కాదా..? అంటూ…
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగంలో ఇప్పటికే లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు సీఎం కేసీఆర్… నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో క్లారిటీ రావడంతో మరో 50 వేల ఉద్యోగాలకోసం కార్యాచరణ రూపొందించామన్నారు.. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు ఉంటాయని తెలిపారు. ఇక, అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలను తెలంగాణ ప్రజలు దక్కించుకోవడం ఇప్పటికే ప్రారంభమైందన్న ముఖ్యమంత్రి… దండుగన్న వ్యవసాయం నేడు పండుగలా మారడమే అందుకు ఉదాహరణగా…
తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం అప్పుడు ఉద్యమించాం… ఇప్పుడు కేసీఆర్ను గద్దె దించేందుకు కార్యకర్తలు ఉద్యమంలా పనిచేయాలంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి చమరగీతం పడాలంటే ప్రతి బీజేపీ కార్యకర్త సైనికుల్లా పనిచేసి, బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషిచేయాలన్నారు.. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర సంపదను దోచుకొని…
వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కూతురు వైఎస్ షర్మిల.. తొలిసారి మీడియా ముందుకు రాబోతున్నారు.. పార్టీ జెండా, పేరు, అజెండా ప్రకటించిన తర్వాత ఆమె మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. రేపు లొటస్పాండ్లో మీడియాతో మాట్లాడనున్నారు షర్మిల.. రాష్ట్ర స్థాయి కార్యవర్గం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.. జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, పరిశీలకులను కూడా ప్రకటించనున్నారు.. మెంబర్ షిప్ డ్రైవ్, అక్టోబర్…
ఆయన పాట పాడితే పార్టీ నేతలకు, కేడర్కు హుషారొస్తుంది. ఆ పాటే ఆయన్ని అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేసింది కూడా. మారిన రాజకీయ పరిణామాలు.. మరికొన్ని సంఘటనలతో మాట పెగలలేదు.. పాటా రాలేదు. ఇంతలో రకరకాల ఊహాగానాలు షికారు చేశాయి. ఆ ఊహాగానాలు నిజమైతే కష్టమని భావించారో ఏమో.. పిలిచి జోలపాట పాడారు. మరి.. ఆ జోలపాట వర్కవుట్ అవుతుందా? మళ్లీ చర్చల్లోకి వచ్చిన రసమయి! రసమయి బాలకిషన్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. తెలంగాణ…
తెలంగాణలో త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. కొత్త జోన్లు, కొత్త జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీ, ఖాళీల గుర్తింపు తదితర అంశాలపై కసరత్తు సాగుతోంది.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తుందనే 50 వేల ఉద్యోగాలు అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ సోయం బాపురావు… ప్రతి ఎలక్షన్ సమయంలో 50 వేల ఉద్యోగలు ఇస్తానని సీఎం ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించిన ఆయన..…
ఆ నాయకుడి రాజకీయ భవిష్యత్ ఎక్కే మెట్టు దిగే మెట్టుగా మారిందా? కొత్త నిర్ణయం కలిసి వస్తుందా? ఉన్నచోట ఎందుకు ఇమడ లేకపోయారు? కొత్త పార్టీలో ఎదురయ్యే సవాళ్లేంటి? ఎవరా నాయకుడు? కాంగ్రెస్లో ఎర్ర శేఖర్ కొత్త ప్రయాణం ఎలా ఉంటుంది? బీజేపీకి పాలమూరు జిల్లాలో గట్టి షాకే తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరబోతున్నట్టు ప్రకటించారాయన. గతంలో సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగిన…
ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లు నీటి మీద రాతలే… అందుకే నిరుద్యోగ యువత ఆత్మహత్య యత్నాలు చేసు కుంటున్నారు అని అన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు Nvss ప్రభాకర్. సీఎం చెప్పిన అధికారులు ఉద్యోగ ఖాళీలు ఇవ్వక పోవడం సీఎం అసమర్థతే కారణం… ఇది నిరుద్యోగులను వంచించడమే అని తెలిపారు. గో హత్య యథేచ్ఛగా రాష్ట్రంలో సాగుతోంది.. ప్రభుత్వం పైపై చర్యలు మాత్రమే తీసుకుంటుంది. నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరుస్తోంది. అసదుద్దీన్ ఒవైసీ డీజీపీకి లేఖ రాసాడు……