Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagyashri Borse ఇటీవల ‘లెనిన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హీరోయిన్ కావాలనే తన నిర్ణయం వెనుక ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకుంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “నేను హీరోయిన్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు నా కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. మొదట నా తల్లితో మాట్లాడాను. కానీ ఆమె నా నిర్ణయానికి అంగీకరించలేదు. ఆ తర్వాత నాన్నను అడిగితే.. ‘మీ అమ్మకు ఇష్టం లేదు’ అని చెప్పారు. కనీసం నా సోదరి అయినా నాకు అండగా ఉంటుందని అనుకున్నాను. కానీ ఆమె కూడా నా నిర్ణయాన్ని వ్యతిరేకించింది. కుటుంబంలో అందరూ నా ఆలోచనకు వ్యతిరేకంగానే ఉన్నారు” అని తెలిపారు. అయితే నటిగా మారాలనే తన కలను మాత్రం వదులుకోలేదని భాగ్యశ్రీ చెప్పారు.
“ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా లక్ష్యాన్ని వదల్లేదు. ఒక దశలో నా తల్లి నన్ను వాట్సాప్లో బ్లాక్ చేశారు. దాదాపు ఆరు నెలల పాటు నాతో మాట్లాడలేదు” అని భావోద్వేగానికి గురయ్యారు. అయినప్పటికీ తనపై తనకు నమ్మకం ఉండేదని, ఒకరోజు తన తల్లి తన గురించి గర్వపడే స్థాయికి చేరుకుంటాననే విశ్వాసమే తనను ముందుకు నడిపించిందని భాగ్యశ్రీ తెలిపారు. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారుతున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?