ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చినట్టుగానే దత్తత గ్రామం వాసాలమర్రికి దళిత బంధు నిధులు విడుదల చేశారు.. బుధవారం వాసాలమర్రిలో పర్యటించిన ఆయన.. కాలినడకన తిరుగుతూ దళితవాడను పరిశీలించారు.. అక్కడున్న పరిస్థితులను చూసి చలించిపోయారు.. అనంతరం నిర్వహించిన సమావేశంలో.. వాసాలమర్రిలో మొత్తం 76 దళిత కుటుంబాలను గుర్తించామని… ఆ అన్ని కుటుంబాలకు దళిత బంధు పథకం కింద రూ.10 లక్షల చొప్పున రేపే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.. ఆయన చెప్పినట్టుగానే 76 దళిత కుటుంబాలకు రూ.…
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో.. గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు విస్తృత అధికారులు కల్పిస్తూ.. వాటి పరిధిలను నిర్ణయిస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్రం.. అయితే, దీనిపై భిన్నమైన వాదనలే ఉన్నాయి.. ఇక, రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కారం కాకపోవడం.. ఫిర్యాదుల పర్వం కొనాగుతూనే ఉన్నందున.. ఈ నెల 9న జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి.. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఇరు…
ఇంఛార్జ్లను వేయకపోతే పార్టీకి ఛార్జింగ్ కష్టమా? కొత్త పోకడలకు చోటు లేదంటోంది ఎవరు?నిర్ణయం తీసుకుంటే ఒక భయం.. తీసుకోకపోతే మరింత ఆందోళన అన్నట్టుగా పరిస్థితి మారిందా? ఇంతకీ ఏంటా పార్టీ? ఏమా ఇంఛార్జ్ల గోల? నియోజకవర్గాలకు ఇంఛార్జ్లను ప్రకటించాలని కోరారట! తెలంగాణ బీజేపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. అడ్డుకట్ట వేయడానికి ఆపసోపాలు పడుతున్నారు కమలనాథులు. ఇదే సమయంలో కాషాయ శిబిరంలో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. అవి ఆచారణ సాధ్యమా కాదా అని పక్కన పెడితే..…
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు మాజీమంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్ లో గెలవడానికి రూ. 150 ఇప్పటికే పంపిణీ చేశారని ఆరోపణలు చేశారు. తాను సీరియస్ రాజకీయ నాయకుణ్ణి అని.. డ్రామా మాస్టర్ ని కాదన్నారు. తన కున్న ఆప్షన్ పాదయాత్ర నేనని… తాను పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారు. 3,4 రోజులు వాకింగ్ మొదలు పెట్టి ఆ తర్వాత పాద యాత్ర మొదలు పెడతానని స్పష్టం చేశారు. 5…
కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సీఎస్ సోమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. తనపై కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్లు కాదన్నారు సీఎస్ సోమేష్ కుమార్. కోర్టు ధిక్కరణ కేసుల్లో భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమని తెలిపిన ఏజీ.. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని వెల్లడించారు సీఎస్ సోమేష్ కుమార్. విచారణ సందర్భంగా వాస్తవాలు కోర్టు ముందుంచ లేక పోయామన్న సీఎస్.. నిధులు విడుదల చేయవద్దన్న ఆదేశాలు ఉపసంహరించాలని కోరారు.…
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తనిఖీ చేసేందుకు కృష్ణా రివర్ బోర్డు బృందం, ఈరోజు తలపెట్టిన పర్యటన అర్ధంతరంగా వాయిదా పడింది. ఈ మేరకు ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శితోపాటు ఇతర అధికారులకు కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి డి.ఎం.రాయిపూరే లేఖ రాశారు. కృష్ణా బోర్డు బృందంలో తెలంగాణ స్థానికత కలిగిన కేంద్ర జలసంఘం అధికారి దేవేందర్రావు ఉండటంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ సర్కారు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో పిటిషన్ దాఖలు చేసిన తరుణంలో పర్యటన వాయిదా పడింది.…
వృద్ధాప్య పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. వయోపరిమితిని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల వయోపరిమితిని 57 ఏళ్లకు కుదించింది సర్కార్.. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సును 65 ఏండ్ల నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 36, తేదీ: 04-08-2021 ను విడుదల చేసింది.. ఇకపై అర్హులైన 57 ఏళ్ల వారందరికీ కొత్త పెన్షన్లు అందనున్నాయి. వెంటనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను…
కృష్ణానది జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి… ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.. ఈ నేపథ్యంలో.. కృష్ణానది యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించాల్సి ఉంది.. అయితే.. ఆ పర్యటన వాయిదా పటినట్టు ప్రకటించింది కేఆర్ఎంబీ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడిందని అధికారులు వెల్లడించారు. మళ్లీ ఎప్పుడు పరిశీలన చేసేది తర్వాత వెల్లడిస్తామని కేఆర్ఎంబీ తెలిపింది. కాగా, ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకున్నా.. రాయలసీమ…