Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
- కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో తీవ్ర దుమారం
- సోనూ సూద్ ఘాటు స్పందన
- కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు అని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జెన్జెడ్ నిరసనకారులపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందించారు. యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. యువతే నటులను స్టార్లుగా నిలబెడుతుందని, సమాజంలో ప్రతి ఒక్కరి ఎదుగుదలకు ప్రజల మద్దతు ఎంతో ముఖ్యమని అన్నారు. కంగనా నిజంగానే జెన్జెడ్ను ‘‘జనరేషన్ గటర్’’ అని పిలిచి ఉంటే అది చాలా సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

Also Read
- Operation Sindoor: ఆపరేషన్ సింధూర్లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
- Arunachal Pradesh: అరుణాచల్లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
- Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
మీడియాతో మాట్లాడిన సోనూ సూద్.. తొలుత కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను తాను వినలేదని చెప్పారు. అయితే యువత పాత్ర, ప్రజల మద్దతు గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ యువతే నటులను స్టార్లుగా చేస్తారు. మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చేది కూడా వారే. వారు మీతో ఉన్నంత కాలం మీరు ఎదుగుతారు. వారు మీకు దూరమైతే ముందుకు సాగడం కష్టమవుతుంది. అందరినీ కలుపుకుని వెళ్లాలి.’’ అని అన్నారు. వృత్తి ఏదైనా ప్రజలతో అనుబంధం ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ‘‘మీరు నటుడు కావచ్చు, వైద్యుడు కావచ్చు లేదా మరే వృత్తిలో ఉన్నా.. ప్రజలు మీతో అనుసంధానమై ఉన్నంత వరకు మాత్రమే ఈ సమాజంలో మీ ఉనికికి అర్థం ఉంటుంది.’’ అని వ్యాఖ్యానించారు.
అయితే కంగనా రనౌత్ జెన్జెడ్ యువతను ‘‘గటర్’’ అంటూ వ్యాఖ్యానించారని మీడియా ప్రతినిధులు మరోసారి చెప్పడంతో సోనూ సూద్ స్పందించారు. ‘‘ఆమె నిజంగానే అలా చెప్పి ఉంటే అది చాలా సిగ్గుచేటు. అలాంటి మాటలు మాట్లాడకూడదు.’’ అని అన్నారు. మాట్లాడే ముందు ఆలోచించడం చాలా అవసరమని సూచించారు. ‘‘‘తోల్ మోల్ కే బోల్’ అని ఒక సామెత ఉంది. అంటే మాట్లాడే ముందు మాటలను బేరీజు వేసుకోవాలని అర్థం. ఏదైనా చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రజలు దేవుడి మరో రూపం.’’ అని పేర్కొన్నారు.
కంగనా రనౌత్ ఏమన్నారు?
జెన్జెడ్ నిరసనకారులపై కంగనా రనౌత్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో ఈ వివాదం మొదలైంది. జంతర్మంతర్తో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న యువత ఉపయోగించిన భాషపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. నిరసనలకు సంబంధించిన వీడియోలు, రీల్స్ చూడటానికి అసహ్యంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘నా జీవితంలో ఒకే చోట ఇంతటి అసహ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. జెన్జెడ్ నిరసనలకు సంబంధించిన రీల్స్ చూస్తే వాంతి వచ్చినట్లుగా అనిపిస్తోంది. వారు మాట్లాడుతున్న తీరు, ఉపయోగిస్తున్న భాష చాలా అసభ్యంగా ఉంది.’’ అని కంగనా పేర్కొన్నారు. అంతేకాకుండా జెన్జెడ్ యువత స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మాదకద్రవ్యాలు, మద్యం తీసుకునే స్వేచ్ఛను గొప్పగా చూపించుకుంటూ.. తల్లిదండ్రుల సంపాదనపై ఆధారపడి సిగ్గులేకుండా జీవిస్తున్నారని విమర్శించారు.
ఈ క్రమంలో జెన్జెడ్ను ‘‘జనరేషన్ గటర్’’ అంటూ కంగనా వ్యాఖ్యానించారు. వారిలో కొందరు వ్యవస్థకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్నారని, చదువులో కూడా రాణించలేరని ఆరోపించారు. కంగనా వ్యాఖ్యలపై ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తుండగా.. తాజాగా సోనూ సూద్ స్పందనతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
-
Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
-
Door Lock Care Tips: వానలకు మీ ఇంటి తాళాలు పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్తో కొత్తవాటిలా మెరిపించండి!
-
Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
-
Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!