సీఎం కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టాక.. దూరం పాటిస్తూ వస్తున్న కోమటిరెడ్డి. అనూహ్యంగా ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్షలో ప్రత్యక్షమయ్యారు… రేవంత్ శిబిరంలో కోమటిరెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. దీంతో.. పార్టీ కేడర్లో జోష్ కూడా పెరిగింది.. ఇక, ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా…
పదవుల పందేరంలో వారికి మరోసారి రెన్యువల్ దక్కలేదు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? రాజకీయంగా గ్రహణం పట్టిందా.. లేక భవిష్యత్లో ఇంకేదైనా పదవీయోగం ఉంటుందా? అధికార టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆశలు ఎక్కడ తేడా కొట్టాయి..? పదవి గ్యారెంటీ అనుకున్నారు. కానీ.. కొందరు మాజీగానే మిగిలిపోతే.. ఇంకొందరు జనవరిలో మాజీలు కాబోతున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? రెన్యువల్ ఖాయమని భావించిన వారి ఆశలు ఎక్కడ తేడా కొట్టాయి? అధికార టీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం…
కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయింది.. ఇప్పట్లో థర్డ్ వేవ్ ముప్పుకూడా పెద్దగా ఉండకపోవచ్చు అనే అంచనాలు వేశారు.. కానీ, కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది.. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బి.1.1.529 కేసులు వెలుగుచూస్తున్నాయి.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.. అప్రమత్తమైన బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చెక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, సింగపూర్లు సదరన్ఆఫ్రికా దేశాలపై ట్రావెల్బ్యాన్విధించాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం…
హైదరాబాద్ సౌత్ జోన్ పోలీస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళా లో ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, సౌత్ జోన్ డీసీపీ భూపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర సీపీ అంజనీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… పాతబస్తీ చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా ఉంది. మొత్తం 20 ప్రైవేట్ కంపెనీలు…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. నియంత, అవినీతి, కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు సహించరు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అదే నిరూపించింది అని అన్నారు. బీజేపీ ని బద్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడు… ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీ టూర్ అని తెలిపారు. ప్రజలు ఛీత్కరించిన పరవాలేదు బీజేపీ ని బ్లెమ్ చేయాలని తెగించాడు. కేసీఆర్ కు రాజకీయ పతనం ప్రారంభం అయిందని…
ఆశతో హస్తినకు వచ్చాం.. కానీ, కేంద్ర ప్రభుత్వం నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. యాసంగిలో వరి వేయొద్దని కేంద్రం గట్టిగా చెప్పిందని తెలిపారు. మేం ఎంతో ఆశతో వచ్చాం.. కానీ, కేంద్రం నిరాశపరిచిందన్న ఆయన.. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించాం.. కానీ, నిరాశే మిగిలిందన్నారు. కేంద్రమంత్రితో జరిగిన సమావేశంలో.. కేంద్రం ఎంత…
వడ్లు కొనుగోలు వ్యవహారంలో గత కొంత కాలంగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది.. కేంద్రం చెప్పేది ఒక్కటైతే.. రాష్ట్ర నేతలు మాత్రం రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. కేంద్రం స్పష్టంగా చెప్పినా.. టీఆర్ఎస్ ప్రభుత్వమే డ్రామా చేస్తుందని బీజేపీ విమర్శిస్తుందో.. ఇక, దీనిపై మరింత క్లారిటీ కోసం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందానికి నిరశే ఎదురైంది.. తెలంగాణలో యాసంగిలో పండించే వడ్ల కొనుగోలుపై కేంద్రం నిరాశే మిగిల్చింది. యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం…
కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ మొత్తం ఆన్లైన్కే పరిమితం అయ్యింది.. అయితే, సెకండ్ వేవ్ తర్వాత కాస్త సాధారణ పరిస్థితులు నెలకొనడంతో… క్రమంగా విద్యాసంస్థలు తెరుచుకున్నాయి.. ఇదే సమయంలో.. అక్కడక్కడ కోవిడ్ కేసులు వెలుగు చూస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి.. తాజాగా, దుండిగల్ బహదూర్పల్లిలోని టెక్ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది… పలువురు విద్యార్థులకు కరోనా సోకడంతో సెలవు ప్రకటించారు యూనివర్సిటీ నిర్వాహకులు.. రేపటి నుంచి సానిటైజ్ చేసి తరగతులు నిర్వహిస్తామని…
డిసెంబర్ మొదటి వారంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధం అయ్యింది తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డు.. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఇంటర్ ఫలితాలు ఉంటాయని ఇంటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి.. కాగా, గత నెల 25 నుండి ఈ నెల మూడో తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించారు అధికారులు.. ఇక, ఈ నెల 19వ తేదీతో స్పాట్ వాల్యుయేషన్ను కూడా ముగించారు… ప్రస్తుతం మార్క్స్ డేటా క్రోడీకరణ…
తెలంగాణ ప్రభుత్వం ధరణి వెబ్సైట్లో భారీ మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నిషేధిత భూముల తొలగింపు, కొత్త మాడ్యూల్స్తో సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. వ్యవసాయ భూమిలో ఇళ్లు నిర్మిస్తే రైతు బంధు కట్ చేయాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మరోవైపు ధరణి పోర్టల్ వచ్చాక లక్షల ఎకరాల్లో భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. దీంతో కలెక్టర్ కార్యాలయాల చుట్టూ రైతులు తిరగాల్సిన దుస్థితి నెలకొంది. Read Also:…