Health News: భోజనం తర్వాత మీకు “స్వీట్స్” తినాలని అనిపిస్తోందా.? అయితే, ఇదే కారణం కావచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health News: మన బంధువులు లేదా మన చుట్టుపక్కల ఉన్న వారిలో కొందరికి ఉన్నట్లుండి ‘‘స్వీట్స్’’ లేదా ఏదైనా తీపి పదార్థాలు తినాలనే కోరికపుడుతుంది. ముఖ్యంగా, భోజనం తర్వాత చాక్లెట్స్ తినే అలవాటు ఉంటుంది. కొందరు ఒత్తిడి లోనైనా, అలసిపోయిన సందర్భాల్లో కూడా ఇలా స్వీట్లను తింటుంటారు. అయితే, వీటిని వెనక సైన్స్ దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర తినడం వెనక స్వీయ నియంత్రణ లేకపోవడం అని అనుకుంటాము కానీ అది పూర్తిగా నిజం కాదు. స్వీట్లు తినాలనే కోరిక జీవసంబంధమైన, ప్రవర్తనా, పర్యావరణ కారణాల కలయిక వల్ల ప్రభావితం అవుతుందని నిపుణులు చెబున్నారు.
రక్తంలో షుగర్ లెవల్స్ కారణం:
Also Read
- Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
- Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
- Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- Hair Care Tips: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇది నిజమా లేక అపోహా?
చక్కెర పదార్థాలు తినాలనే కోరిక వెనక ముఖ్యకారణాల్లో శరీరంలో షుగర్ లెవర్స్ హఠాత్తుగా పెరిగి, హఠాత్తుగా తగ్గడం ఉంటుంది. మనం వైట్ రైస్, బ్రేడ్ లేదా స్వీట్స్ వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు తిన్నప్పుడు రక్తంలోని చక్కెర స్థాయిలో ఒక్కసారిగా పెరుగుతాయి. ఆ వెంటనే ఇన్సులిన్ పనిచేయడంతో హఠాత్తుగా పడిపోతాయి. ఇలా షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పడిపోయినప్పుడు, శరీరం తక్షణ శక్తి కోసం మళ్లీ తీపి పదార్థాలను కోరుకుంటుంది.
బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్:
స్వీట్స్ తిన్నప్పుడు మన మెదడులో ‘‘డోపమైన్’’ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది మనకు ఆనందాన్ని, ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా అలసిపోయినప్పుడు మన మెదడు ఆ పాత అనుభూతి కోసం మళ్లీ తీపిని కోరుకుంటుంది. గతంలో మనం ఏం తింటే హ్యాపీగా ఉన్నామనే విషయాలను మెదడు గుర్తుంచుకుంటుంది. దీని వల్ల స్వీట్లు తినాలని మనకు చెబుతుంది.
హర్మోన్ల ప్రభావం:
నిద్ర సరిగా లేకపోయినా లేదా అధిక ఒత్తిడికి గురైనా ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీని వల్ల శరీరంలో ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాన్ని కోరుకుంటుంది.
ఎలా నియంత్రించాలి.?
భోజనం తర్వాత స్వీట్స్ తినడం వల్ల లాభాల కన్నా నష్టాలే అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మనం తిన్న ఆహారం వల్ల గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. దీనిని ఇన్సులిన్ కంట్రోల్ చేస్తుంది. అయితే, మళ్లీ స్వీట్స్ తింటే ఇన్సులిన్పై భారం పడుతుంది.
ఇలాంటి పరిస్థితి రావద్దంటే భోజనంలో కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే కాకుండా, ప్రొటీన్స్, ఫైబర్ ఉండే ఆహారాన్ని జత చేయాలి. ఆరోగ్యవంతమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. ఇవి జీర్ణక్రియను నెమ్మది చేసి, రక్తంలో షుగర్ స్పైక్స్ను కంట్రోల్లో ఉంచుతుంది.
రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర ఉండే హర్మోన్లు సమతుల్యంగా ఉండీ, అనవసరమైన ఆకలి ఉండదు. స్ట్రైస్ వల్ల కలిగే ‘ఎమోషనల్ ఈటింగ్’ను అదుపు చేయడానికి వ్యాయామం, రిలాక్సేషన్ పద్ధతులు అవసరం. ఒక్కోసారి దాహం వేసినప్పుడు కూడా ఆకలిగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీని తగినంత నీటిని తీసుకోవాలి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!