ఎమ్మెల్సీగా రెన్యువల్ రానివారికి.. టీఆర్ఎస్లో పదవీయోగం ఉంటుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదవుల పందేరంలో వారికి మరోసారి రెన్యువల్ దక్కలేదు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? రాజకీయంగా గ్రహణం పట్టిందా.. లేక భవిష్యత్లో ఇంకేదైనా పదవీయోగం ఉంటుందా? అధికార టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
ఆశలు ఎక్కడ తేడా కొట్టాయి..?
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
పదవి గ్యారెంటీ అనుకున్నారు. కానీ.. కొందరు మాజీగానే మిగిలిపోతే.. ఇంకొందరు జనవరిలో మాజీలు కాబోతున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? రెన్యువల్ ఖాయమని భావించిన వారి ఆశలు ఎక్కడ తేడా కొట్టాయి? అధికార టీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే గరం గరం టాపిక్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి 19 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసింది టీఆర్ఎస్. వీటిలో ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు కాగా.. 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు.. మరొకటి గవర్నర్ కోటా. ఎమ్మెల్యే కోటాలో నలుగురు.. స్థానిక సంస్థల్లో ఐదుగురికి రెన్యువల్ దక్కలేదు.
ఎమ్మెల్యే కోటాలో నలుగురికి నిరాశ..!
ఎమ్మెల్యే కోటాలో పదవీకాలం పూర్తయిన డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు మాజీలయ్యారు. మరోదఫా శాసనమండలిలో అడుగుపెట్టేందుకు ఈ నలుగురు శతవిధాలా ప్రయత్నించారు. అయితే వారు ఉంటోన్న జిల్లాల్లోని టీఆర్ఎస్ పరిస్థితులు.. సామాజిక సమీకరణాలు.. భవిష్యత్ రాజకీయ అవసరాలు మైనస్గా మారినట్టు టాక్. వీరి ప్లేస్లో కొత్తవారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు అయ్యారు.
స్థానిక సంస్థల కోటాలో ఐదుగురు రీప్లేస్..!
ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఖాళీ అయిన 12లో ఏడుగురు మాత్రమే మళ్లీ రెన్యువల్ సాధించారు. ఐదుగురు సిట్టింగ్లకు నిరాశ తప్పలేదు. ఆదిలాబాద్లో పురాణం సతీష్.. కరీంనగర్లో నారదాసు లక్ష్మణరావు, మెదక్ జిల్లాలో భూపాల్రెడ్డి, నల్లగొండ జిల్లాలో తేరా చిన్నపరెడ్డి, ఖమ్మం జిల్లాలో బాలసాని లక్ష్మీనారాయణల ప్లేస్లో కొత్తవారికి అవకాశం ఇచ్చింది పార్టీ. స్థానిక సంస్థల కోటాలో ఆకుల లలిత పేరు ప్రచారంలోకి వచ్చినా.. చివరి నిమిషంలో జాబితాలో చోటు దక్కలేదు. గవర్నర్ కోటాలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
భవిష్యత్ పదవుల భర్తీలో పరిగణనలోకి తీసుకుంటారా?
తాజా పదవుల పందేరంలో టీఆర్ఎస్ ఫ్రేమ్లో పట్టని 9 మంది రాజకీయ భవిష్యత్పై రకరకాలుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి గ్రహణం పట్టినా.. భవిష్యత్లో పదవుల భర్తీలో వీళ్లను పరిగణనలోకి తీసుకుంటారా? లేదా పార్టీలో పదవులేమైనా ఇస్తారా అన్నది ఒక చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వీళ్లంతా పైకి నవ్వుతూ ఉన్నా.. రెన్యువల్ దక్కక ఒకింత అసంతృప్తిలో ఉన్నారన్నది అనుచరుల మాట. ఎవరూ కిక్కురుమనడం లేదు. తాజా మాజీల సేవలను పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందో ఏమో.. అప్పటి వరకు వీళ్లపై చర్చ తప్పేలా లేదు.
తాజావార్తలు
-
Avatar 3: ఫైనల్గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
-
Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
ట్రెండింగ్
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..