సీఎం కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టాక.. దూరం పాటిస్తూ వస్తున్న కోమటిరెడ్డి. అనూహ్యంగా ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్షలో ప్రత్యక్షమయ్యారు… రేవంత్ శిబిరంలో కోమటిరెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. దీంతో.. పార్టీ కేడర్లో జోష్ కూడా పెరిగింది.. ఇక, ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కోమటిరెడ్డి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చెప్పులతో కొట్టండి అంటూ రైతులకు పిలుపునిచ్చారు.. వరి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను గోస పెడుతున్నారు.. సీఎం కేసీఆర్ను కూడా అడ్డుకోండి అని సూచించారు.
Read Also: ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం..
ఇక, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన కోమటిరెడ్డి.. నేను ఎవరితో నైనా కలిసి పనిచేస్తా.. కాంగ్రెస్ పార్టీ అంటే కోమటిరెడ్డి, ఉత్తమ్, రేవంత్రెడ్డే కాదన్నారు.. కార్యకర్తల వల్లనే మేం నాయకులం అయ్యాం.. నేను అడిగింది పీసీసీ పదవి.. ఇప్పుడు కూడా పార్టీ కోసం పని చేస్తా.. పదవులు ఎవరైనా తీసుకొని అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నేను 7 ఎమ్మెల్యేలను గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు కోమటిరెడ్డి.. మిగిలిన నాయకులు కూడా తలా 10 మందిని గెలిపిస్తే చాలన్నారు. తెలంగాణ రైతుల సమస్యలపై పార్లమెంట్లో లేవనెత్తుతాం అన్నారు భువనగిరి ఎంపీ.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కూడా పార్లమెంట్ లో రైతుల సమస్యలపై మాట్లాడిస్తామన్న ఆయన.. ఢిల్లీలో ఆందోళన చేస్తాం… ప్రియాంక గాంధీని కూడా పిలుస్తాం అన్నారు.