తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం సాధించారు.. ఇక, ఈ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తొలిసార బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాబోతున్నారు ఈటల.. ఘన విజయం తర్వాత బీజేపీ హెడ్ క్వార్టర్స్కు వస్తున్న ఈటలకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి పార్టీ శ్రేణులు.. తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ పేరిట శామీర్ పేట నుంచి ర్యాలీ చేపట్టనున్నారు.. మధ్యాహ్నం ఒంటి గంటకు శామీర్పేట నుంచి బయల్దేరనున్న ఆయన..…
కరోనా కారణంగా తల్లిదండ్రుల ఆదాయం తగ్గడంతో అప్పటివరకూ ప్రైవేట్ స్కూళ్ళలో వేలకు వేలు ఫీజులు కట్టి చదివించిన వారు సర్కారీ బడుల బాట పట్టారు. చదువు ఎలా వున్నా ఫర్వాలేదు.. ఆర్థిక భారం మోయలేమంటూ వారంతా ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయించారు. అయితే పరిస్థితులు మారాయి. భుత్వ పాఠశాలల నుండి తిరిగి ప్రైవేట్ స్కూల్స్ కి విద్యార్థుల వలసలు పెరిగాయంటున్నారు అధికారులు. కరోన కారణంగా లాక్ డౌన్, ఫీజులు కట్టలేక తమ పిల్లలను ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో…
వానాకాలం పండిన పంట ప్రతి గింజ కొంటామని.. ఆ దిశగా కేంద్రంపై సీఎం కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6540 ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని… ఇప్పటివరకు 1762 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అధికారులు సూచించిన తేదీల్లో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని… యాసంగిలో సాగయ్యే ప్రతి పంటను కేంద్రం కొనుగోలు చేయాలని…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. అది దక్కించుకోలేకపోయారు పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంటకర్రెడ్డి, మరోవైపు.. ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టేస్తుంటారు.. ఇక, పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. టి.పీసీసీ.. కోమటిరెడ్డి మధ్య గ్యాప్ కొనసాగుతూనే ఉంది. అయితే, కోమటిరెడ్డి బ్రదర్స్తో తాను మాట్లాడుతా అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత,…
రైతుల తలరాత మార్చే.. తరతరాలు ఉండే గొప్ప ప్రాజెక్టు మల్లన్నసాగర్ అని… అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్ల ముందు జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ను శుక్రవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీఏం కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం అయ్యిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ మేరకు ఎన్ని టీఏంసీల…
మంచిరేవుల ఫామ్ హౌస్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ కస్టడీ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.. సుమన్ రెండు రోజుల కస్టడీ ముగియడంతో.. ఇవాళ ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు.. దీంతో.. గుత్తా సుమన్ ను మరోసారి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు.. ఆ తర్వాత ఉప్పరపల్లి కోర్టు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు నార్సింగ్ పోలీసులు… మరోవైపు.. బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు కొనసాగనున్నాయి.. ఇక, ఫామ్హౌస్…
80 శాతం హిందువులున్న దేశంలో ధర్మ కార్యం చేయడం మతతత్వమవుతుందా? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగేదా? 370 ఆర్టికల్ రద్దు జరిగేదా? అని తెలిపారు. నల్లకుంటలోని శంకర మఠానికి వెళ్లారు బండి సంజయ్. రాష్ట్రంలో అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని… చాలా దేవాలయాలు ఇప్పటికీ దూప, దీప నైవేద్యాలకు నోచుకోకపోవడం బాధాకరమని తెలిపారు. కేదారనాథ్ లోని ఆది శంకరాచార్యుల సమాధి…
హైదరాబాద్ ఓల్డ్సిటీ ఛత్రినాక పేలుడు కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది.. టపాసులతో పాటు కెమికల్ పెట్టి మరీ యువకులు పేల్చినట్టుగా పోలీసులు గుర్తించారు. గుంతలో టపాసులు పెట్టిన.. కొందరు యవకులు.. దానితో పాటు కెమికల్స్ మిక్స్ చేశారు. గుంతలో కెమికల్స్, టపాసులు కలవడంతో పేలుడు తీవ్రత పెరిగింది.. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది.. ఇక, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించారు. కాగా, ఛత్రినాక…
ఉన్నవి ఆరు పదవులు…ఆశావహులు మాత్రం భారీగానే ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ…ఆ జిల్లా నుంచి ఎవరికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తుంది ? ఎవరికి ఏ అంశం కలసి వస్తుంది ? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడిదే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల అయ్యింది. ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలు…అధికార పార్టీకే దక్కుతాయి. దీనితో టిఆర్ఎస్ పార్టీలో ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ అవసరాలు, సామాజిక సమీకరణాలు,…
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. టపాసుల మోత మోగాల్సిందే.. చిన్నా, పెద్ద ఇలా ఇంటిల్లిపాది కలిసి పటాకులు కాల్చుతూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు.. అయితే, అవి ప్రమాదాలు తెచ్చిపెట్టే సందర్భాలు అనేకం.. ముఖ్యంగా.. కంటి సమస్యలకు దారి తీస్తున్నాయి.. టపాసులు కాల్చే సమయంలో.. పలు జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా చిన్నపిల్లలు.. పెద్దల పర్యవేక్షణలో బాణాసంచా కాల్చితే మంచిదంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నా.. నిర్లక్ష్యంగా టపాసులు కాల్చి ఇబ్బందులు పడుతూ.. ఆస్పత్రికి క్యూ కడుతున్నారు బాధితులు.. ఇక, హైదరాబాద్లో…