హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం వైపు దూసుకెళ్తున్నారు.. ఇప్పటి వరకు టీఆర్ఎస్కు పట్టుకున్న మండలాల్లో ఓట్ల లెక్కింపు జరిగినా.. ఆధిక్యంలోనే కొనసాగుతూ వచ్చారు ఈటల.. మిగతా మండలాల్లో ఈటలకు అనుకూలమైన ఓటింగే భారీగా ఉందనే అంచనాలున్నాయి.. దీంతో.. ఈటల గెలుపు నల్లేరు మీద నడకే అని అంచనా వేస్తున్నారు. ఇక, ఈటల ఆధిక్యం పెరుగుతున్నా కొద్ది.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిపోతోంది.. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…
నష్టాల సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ.. క్రమంగా పుంజుకుంటోందా..? ఆర్టీసీని నష్టాల నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా..?అవుననే అంటున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఆర్టీసీ ఆదాయం పెరిగిందని చెబుతున్నారు..ఆర్టీసీ ఆదాయం రికార్డుస్థాయిలో పెరిగిందన్నారు ఎండీ సజ్జనార్.. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సహకారంతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. రాబోయే మార్చిలోపు తార్నాక ఆసుపత్రిని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేందుకు నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు…
చదివిన చదువుకు తగిన ఉద్యోగం కావాలని నిరుద్యోగులు కోరుకుంటారు. కానీ వారి ఆశలు ఆవిరవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ సరైన ఉద్యోగాల భర్తీ జరగలేదు. నిధులు, నీళ్ళు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఏర్పడి ఏడేళ్ళు అవుతోంది. వయసు మీదపడుతోంది. కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు నిరుద్యోగులకు ఇబ్బందిగా మారాయి. దీనికి తోడు చిన్నాచితకా ఉద్యోగాలు చేద్దామన్నా కరోనా మహమ్మారి వల్ల అవి కూడా కుదరడం లేదు. రాష్ట్రంలోని రెండేళ్లుగా ఎదురుచూస్తున్న జంబో ఉద్యోగ ప్రకటన ఇంకెప్పుడు…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం మరికొద్ది గంటల్లో వెలువడనుంది.. అధికార టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు… అన్ని ప్రయత్నాలు చేసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత… మండలాల వారిగా ఇన్చార్జ్లను నియమించింది. నియోజకవర్గంలో పట్టుసాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు… విస్తృతంగా పర్యటించి… గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం మొదలు… పోలింగ్ రోజు ఓటర్లను పోలింగ్ బూతులకు చేర్చే వరకు పక్కా…
పోలీసులకు భయపడి ఓ వ్యక్తి పారిపోతూ బావిలో పడి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… జమ్మికుంటకు చెందిన పొనుగంటి వేణు అనే యువకుడు ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో సరాదాగా స్నేహితులతో గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు వేణు తన స్నేహితులతో కలిసి హుజురాబాద్ రోడ్డులోని ఓ బారు సమీపంలో ఆదివారం రాత్రి సమయంలో మద్యం సేవిస్తున్నాడు. అయితే…
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,326 శాంపిళ్లను పరీక్షించగా 160 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మరణించారు. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,71,623కి చేరగా… మరణాల సంఖ్య 3,958కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 193 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ బారిన పడి ఇప్పటివరకు 6.63 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,974 కరోనా కేసులు యాక్టివ్గా…
‘విజయగర్జన‘ సభను వాయిదా వేసింది టీఆర్ఎస్ పార్టీ.. ముందుగా ఈ నెల 15న విజయగర్జన సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు గులాబీ అధినేత కేసీఆర్.. అయితే, వరంగల్లో ఇవాళ జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ఈ సభను వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. దీనిపై సీఎం కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.. నవంబర్ 15 న జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగాణ ధీక్షా దివస్ అయిన నవంబర్ 29వ తేదీన నిర్వహించాలని…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. ఫిర్యాదుల పర్వానికి ఇప్పట్లో తెర పడేలా కనిపించడం లేదు.. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదాల పరిష్కారానికి ఇటు కృష్ణానది యాజమాన్య బోర్డు, అటు గోదావరి నది యాజమాన్య బోర్డు పరిధిలను నిర్ణయిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసినా.. ఇంకా పులిస్టాప్ పడే దాఖలాలు కనిపించడంలేదు.. ఇవాళ కేఆర్ఎంబీకి మరో లేఖరాసింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.. రాజోలిబండ హెడ్ వర్క్స్ ను కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిలోకి…
తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్టు-2021 ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. ఈ ఫలితాల్లో 96.99 శాతం మంది అర్హత సాధించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్టు కోసం 5,054 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 14 కేంద్రాల్లో అక్టోబర్ 23న నిర్వహించిన ఈ పరీక్షకు 3,087 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,994 మంది అర్హత సాధించారు. Read Also: తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది…
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలతో చీఫ్ ఎలక్టోరల్ అధికారి శశాంక్ గోయల్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై చర్చ జరిగింది. అనంతరం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. నవంబర్ 1, 2021న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణలో 3,08,75,744 మంది ఓటర్లున్నారు. ఈ జాబితాలో పురుషులు 1,52,57,690 మంది, మహిళలు 1,50,97,292 మంది, థర్డ్ జెండర్ 1,683 మంది, సర్వీస్ ఓటర్లు 14,501 మంది, ఎన్నారై…