కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుంది: మంత్రి నిరంజన్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు బంధు సంబరాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటూ అటు పార్టీ కార్యకర్తలను, రైతులను ఉత్సాహ పరుస్తున్నారు. కాగా మరోవైపు ప్రభుత్వం రైతుబంధు సంబంధించిన అంశాలను రైతులకు వివరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలో జరిగని రైతు బంధు కార్యక్రామానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడారు. విత్తనాలను మొలకెత్తించి వాటిలో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించటం సాధారణమైన విషయం కాదని మంత్రి అన్నారు. వారం రోజులుగా రైతు బంధు వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా పండుగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రైతులు స్వచ్ఛంధంగా బయటకు వచ్చి రైతుబంధు సంబరాల్లో పాల్గొంటున్నారన్నారు. వినూత్న రీతిలో ప్రజలు ఇళ్ల ముందు ముగ్గులు వేసి రైతు బంధు అందించినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారని వెల్లడించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో రైతు వ్యతిరేఖ విధానాలను అవలంభిస్తుందని మండిపడ్డారు. 50 వేల600 కోట్ల రూపాయాలను రైతు బంధు ద్వారా పేదలకు పెట్టుబడి రూంలో అందించామని తెలిపారు.
Read Also: రూల్స్ బ్రేక్ చేస్తున్న ప్రజాప్రతినిధులు
Also Read
- Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
ప్రతి ఏటా సగటున 60వేల కోట్ల రూపాయలను రాష్ట్రంలోని రైతాంగం కోసం ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. 15నెలల పాటు లక్షల మంది రైతులు ఢిల్లీ చుట్టూ చేరి నల్ల చట్టాల ఉపసంహరణ కోసం పోరాటాలు చేశారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని రైతులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.ప్రజల చేతుల్లో ఉన్న ఆహార రంగాన్ని కార్పొరేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని దీన్ని తిప్పికొట్టాలన్నారు. సాగు నీటిని ఉచితంగా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. సత్తుపల్లి ప్రాంత ఫామాయిల్ రైతుల అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.
ట్రాక్టర్ నడిపిన సబితా ఇంద్రారెడ్డి..
రైతుబంధు సంబరాల్లో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్రాక్టర్నడిపారు. మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో రైతు సంబరాల్లో పాల్గొని ఎడ్ల బండి, ట్రాక్టర్ పై ర్యాలీ నిర్వహించారు. దీంతో తమతో ట్రాక్టర్, ఎడ్లబండిలో మంత్రి రావడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
-
NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
-
CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
-
Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
-
ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..