తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9కి చేరింది. తాజాగా హన్మకొండ, హైదరాబాద్ చార్మినార్ ప్రాంతాలలో కొత్త కేసులు నమోదయ్యాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయంలో సేకరించిన నమూనాల్లో 9మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. వీరిలో 8 మంది రాష్ట్రంలోకి ప్రవేశించారని, మరో వ్యక్తి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడన్నారు. ఇప్పటివరకు సామాజిక వ్యాప్తి జరగలేదని స్పష్టం చేశారు. Read Also: హన్మకొండలో ఒమిక్రాన్ కలకలం..ఓ…
తెలంగాణలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజా ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది.. తాజాగా హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది.. అయితే.. మొదట ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీలో మాత్రం టెన్షన్ నెలకొంది.. ఆ ప్రాంతంలో ట్రేసింగ్, టెస్టింగ్ విస్తృతంగా నిర్వహిస్తున్నాయి మెడికల్ టీమ్లు… కాంటాక్టుల్లోనూ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. దీంతో.. ఆ ప్రాంతంలో మరింత…
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8 కి చేరింది. తాజాగా హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఇటీవలే ఆ మహిళ విదేశాల నుంచి వచ్చినట్లు హెల్త్ డైరెక్టర్ పేర్కొన్నారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి ఒమిక్రాన్ వచ్చిందని.. మిగతావి నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికి వచ్చినట్లు వెల్లడించారు. ఒమిక్రాన్…
సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క హస్తిన పర్యటన వాయిదా పడింది.. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో జరగాల్సిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ రద్దు అయ్యింది. మరోవైపు రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు సీనియర్ పొలిటిషన్, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్.. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుచరులతో సమావేశమై చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి రానున్నారు. మొత్తంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత తిరిగి కాంగ్రెస్…
మంత్రి పదవిపై వాళ్లిద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అనేక లెక్కలు.. కూడికలు వేసుకున్నారు కూడా. చట్టసభలకు వెళ్లినా.. కేబినెట్లో బెర్త్ వాళ్లకు అందని ద్రాక్షాయేనా? సమీకరణాలు ఎక్కడ తేడా కొడుతున్నాయి? కొత్త ఎమ్మెల్సీలు చాలా ఆశలే పెట్టుకున్నారా? పాత కొత్త కలిపి.. తెలంగాణ శాసనమండలికి ఇటీవల 19 మంది ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో 12 మంది.. ఎమ్మెల్యేల కోటాలో ఆరుగురు.. గవర్నర్ కోటాలో ఒకరు ఈ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం మండలిలో ఛైర్మన్, డిప్యూటీ…
తెలంగాణ కాంగ్రెస్ పాదయాత్రల బాట పడుతోంది. పెరిగిన ధరలే అస్త్రాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనంలోకి వెళ్తోంది. మరోవైపు…భూ సంస్కరణలపై ఒక రోజు పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు రాహుల్ గాంధీ. నిత్యవసర ధరల పెరుగుదలపై ఏఐసీసీ పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు పాద యాత్రలు చేపట్టారు. రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో… తెలంగాణ పిసిసి ఆందోళన బాట పట్టింది. పిసిసి చీఫ్ రేవంత్ చేవెళ్ల నుండి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ జాతీయ…
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో చాలా మంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావడం చర్చనీయాంశంగా మారింది. కొన్నింటిలో 90కి పైగా మార్కులు రాగా మరికొన్నింట్లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారు. ఉదాహరణకు హైదరాబాద్ నగరానికి చెందిన ఓ విద్యార్థికి ఇంగ్లీష్లో 92 మార్కులు, సంస్కృతంలో 93 మార్కులు, ఫిజిక్స్లో 55 మార్కులు, కెమిస్ట్రీలో 50 మార్కులు రాగా మ్యాథ్స్ Aలో 27, మ్యాథ్స్ Bలో…
నామినేటెడ్ పదవుల కోసం చాలా కాలంగా ఆశావహులు ఎదురుచూస్తున్నారు.. అయితే, అందులో కొంతమందికి శుభవార్త చెప్పారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు.. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు సీఎం కేసీఆర్.. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా గజ్జెల నగేష్. తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్గా పాటిమీది జగన్ మోహన్ రావు.…
రాష్ర్టప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణకు హరితహారం పథకం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగడానికి రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆకుపచ్చ తెలంగాణ మార్చడానికి కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ పథకాన్ని గ్రామస్థాయి నుంచి అమలు చేసి హరిత తెలంగాణ నిర్మించడంలో ప్రభుత్వం కొంతమేరకు విజయవంతం అయిందని చెప్పవచ్చు. ఈ పథకంలో గ్రామ స్థాయినుంచి ప్రతి ఒక్కర్ని భాగస్వామ్యం చేసి మంచి ఫలితాలు సాధించారు. Also Read: ఇక్కత్ చేనేత కార్మికులకు ప్రోత్సాహం:…
తెలంగాణలో చలి విపరీతంగా పెరిగింది. ఈశాన్య గాలుల ప్రభావం వల్ల చలి తీవ్రస్థాయిలో పెరిగిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు. ఉత్తరాది నుంచి బలమైన చలిగాలులు వీయనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించారు. ఈనెల 18 నుంచి 20 వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 4 నుంచి 10 డిగ్రీల వరకు నమోదు కావచ్చని సూచించారు. Read Also: ఇంటర్ విద్యార్థి సంచలన ట్వీట్.. నా సూసైడ్కు కారణం…