సెక్రటేరియట్ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు కేసీఆర్. నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమౌతున్న రాష్ట్ర సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనుల పురోగతి పై సీఎం కేసీఆర్ ఈ సమీక్షలో అధికారులతో చర్చించారు. ముఖ్యమైన పనులతో పాటు, లాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, తదితర అనుబంధ భవనాల నిర్మాణ పనుల వేగాన్ని కూడా సమాంతరంగా పెంచాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం సూచించారు.
Read Also:బ్రెజిల్లో దారుణం..పర్వతం కూలి ఏడుగురి మృతి
సచివాలయానికి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పోలీసులకు కావాల్సిన వసతులు తదితర అంశాలను గురించి డిజీపీ మహేందర్ రెడ్డితో సంప్రదించి చర్యలు వెంటనే చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. 24 గంటల నిఘా కోసం అధునాతన సాంకేతికతతో కూడి న పోలీసు కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులు సైతం వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.